సాయి పల్లవికి బాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్.. ఓకే చెప్పిందంటే ఫ్యాన్స్ కి పండగే!?

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తర్కెక్కిన `బాహుబలి` తెలుగులో రూపుదిద్దుకుని ఐదు భాషల్లో విడుదలై భారతీయ సినీ పరిశ్రమ చరిత్రను నలు దిశలా వ్యాపించి ప్రపంచ ఖ్యాతిని అందుకుంది. దీంతో అన్ని ఇండస్ట్రీ వర్గాల వారు ఆ రేంజ్ భారి బడ్జెట్ సినిమా చేయాలని ఎంత ట్రై చేసినప్పటికీ `బాహుబలి` దరిదాపుల్లోకి కూడా చేరుకోలేదు.

తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న `ఆదిపురుష్` కూడా రామాయణం ఆధారంగా రూపొందుతున్న అంతకుముందు నుండే హిందీలో రామాయణం గురించి సినిమా తీయబోతున్నట్టు ప్రచారాలు జరిగాయి. అయితే ఎప్పటినుంచో బాలీవుడ్ లో అల్లు అరవింద్ ఓ భారీ బడ్జెట్ తో ఈ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారట.అయితే నితీష్ తివారీ డైరెక్షన్ లో అగ్ర నిర్మాత అయిన అల్లు అరవింద్ నిర్మాతగా తెరకెక్కబోయే `రామాయణ` గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.

అయితే ఈ సినిమాలో యంగ్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా అలాగే బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ రావణాసురుడిగా కనిపించబోతున్నారని సమాచారం. ఇక అసలు విషయం ఏమిటంటే రామాయణంలో మోస్ట్ టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి సీత పాత్రలో కనిపించబోతుందని వార్త‌లు వినిపిస్తున్నాయి.

సాయి పల్లవి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేసి తన నటన, డాన్సింగ్ స్టైల్ తో అందరినీ మెస్మరైస్ చేస్తుంది. ఇకపోతే ఈ హిస్టారికల్ సినిమాలో సీత క్యారెక్టర్ కోసం సాయి పల్లవిని అనుకుంటున్నారని త్వరలోనే ఆమెను కలిసి కథ చెప్పనున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ సాయి పల్లవి కనుక ఈ సినిమా చేస్తే తన నటనకు బాలీవుడ్ ఇండస్ట్రీ ఫిదా అవ్వాల్సిందే అని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. సాయి పల్లవికి బాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్.. అంటూ ఆమె ఓకే చెప్పిందంటే ఫ్యాన్స్ కి పండగే పండుగ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.