బాల‌య్య `అన్ స్టాపబుల్ 2`కు గ్లామ‌ర్ ట్రీట్‌.. నెక్స్ట్ గెస్ట్‌లుగా ఆ ఇద్ద‌రు హీరోయిన్లు!?

నందమూరి నట సింహం బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో తో యూత్ లో క్రేజీ హోస్ట్ అయిపోయాడు. అటు వెండితెర పైనే కాకుండా ఇటు బుల్లితెర పైన కూడా హీరోనేనని నిరూపించుకుంటున్నాడు. సినీ సెలబ్రిటీలను, రాజకీయ ప్రముఖులను ఈ షోకు తీసుకువచ్చి వారితో తనదైన మాటలతో, సెన్సాఫ్ హ్యూమర్ తో ఇంటర్వ్యూ చేస్తూ బాలయ్య చేసే సందడి అంతా కాదు. టాక్ షోలన్నిటిలోనూ అన్ స్టాపబుల్ షో నే నెంబర్ వన్ గా ఉంది అంటే దానికి కారణం బాలయ్యనే.. మొదటి సీజన్ ను ఘనవిజయంగా పూర్తిచేసిన ఆహా ఇటీవల సీజన్ 2 తో ప్రారంభమైనది.

ఈ షో మొదటి ఎపిసోడ్లో తన బావ అయిన మాజీ సీఎం చంద్రబాబుతో పాటు ఆయన అల్లుడు నారా లోకేష్ వచ్చి సందడి చేశారు. ఇటీవల వచ్చిన రెండో ఎపిసోడ్లో విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ లు గెస్ట్ లుగా వచ్చారు. ఇప్పుడు మూడో ఎపిసోడ్ గాను సీనియర్ నటి మరియు జూనియర్ నటి షోకి రాబోతున్న వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ దాదాపు మూడు శతాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో అనేక సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్నారు. ఇండస్ట్రీకి వచ్చే కొత్త హీరోయిన్స్ తో పాటు స్టార్ హీరోయిన్స్ సరసను కూడా ఈయన నటించారు. ఆ స్టార్ హీరోయిన్స్ లో రమ్యకృష్ణ కూడా ఒకరు.

అప్పట్లో రమ్యకృష్ణ సినిమాలంటే యూత్ లో మంచి క్రేజ్ ఉండేది. ఆ సమయంలోనే బాలకృష్ణతో రమ్యకృష్ణ చేసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. వీరిద్దరి కాంబినేషన్లో “బంగారు బుల్లోడు“ అనే బ్లాక్ బాస్టర్ సినిమా మనందరం చూసిందే. అయితే ఈ సినిమాలో జంటగా కలిసి చేసిన వీరు ఇప్పుడు అన్ స్టాపబుల్ వేదికగా మళ్లీ కలుసుకోబోతున్నారట.

మరొక హీరోయిన్ రాశి ఖన్నా ఈ షోకు రానున్నట్టు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సరసన నటించిన రాశి ఖన్నా ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలలో కనిపించకపోయినా తమిళంలో మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. ఇక ఈ క్రమంలోనే సీజన్2 లో మూడో ఎపిసోడ్ కు సీనియర్ నటి అయిన రమ్యకృష్ణను మరోపక్క జూనియర్ నటి అయిన రాశి ఖన్నాను ఈ షోకు గెస్ట్ లుగా ఆహ్వానించారు. ఈ ఎపిసోడ్లో బాలయ్యతో ఈ ఇద్దరు గ్లామర్ హీరోయిన్స్ ఎలా ఎంజాయ్ చేస్తారో చూద్దాం.