ఇలా అయితే ఎలా సాక్షి.. జ‌గ‌న్‌కు మైన‌స్సేగా

నంద్యాల తీర్పు వ‌చ్చేసింది. అధికార పార్టీ విజ‌యాన్ని కైవ‌సం చేసుకుని సైకిల్‌పై రివ్వున సాగిపోయింది. త‌మ‌దే సీట‌ని భావించి, అతికిపోయిన వైసీపీ చ‌తికిల ప‌డింది. ఇది వాస్త‌వం!! ఏ జ‌ర్న‌లిస్ట‌యినా.. ప‌త్రికైనా ముందుగా రాయాల్సింది ఇదే! ఇక‌, ఆ త‌ర్వాత వారివారి అభిమానాన్ని బ‌ట్టి.. వార్త‌ల ప్ర‌చుర‌ణ ఉండాలి. కానీ, ఈ విజ‌యాన్ని కూడా ఏక‌ప‌క్షంగా చూడ‌డం అనేదే ఇప్పుడు అసంతృప్తికీ.. జ‌ర్న‌లిజంపై రాళ్లేయ‌డానికి అవ‌కాశం ఇచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. వైసీపీ అధినేత జ‌గ‌న్ స్థాపించిన ప‌త్రిక సాక్షి… […]

టీడీపీలోకి 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు.. లిస్ట్ ఇదే..?

నంద్యాల ఫలితం వైసీపీకి 2019లో అధికారం ద‌క్కుతుందా ? అన్న ప్ర‌శ్న‌కు ఇదే ప‌రిస్థితి కంటిన్యూ అయితే మాత్రం క‌ష్ట‌మే అన్న ఆన్స‌ర్లే ఎక్కువుగా వినిపిస్తున్నాయి. వైసీపీ వాళ్లు కూడా ఇదే విష‌య‌మై ఆందోళ‌న‌తో చ‌ర్చించుకుంటున్నారు. జ‌గ‌న్‌కు బ‌ల‌మైన రాయల‌సీమ‌లోనే ఈ ప‌రిస్థితి ఎదుర‌వ్వ‌డంతో సీమ‌లో వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు, అభిమానులు, కార్య‌క‌ర్త‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇక ఈ మూడేళ్ల‌లో జ‌గ‌న్ తీరుతో విసిగిపోయిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సైకిల్ ఎక్కేశారు. 21 మంది ఎమ్మెల్యేలు నంద్యాల‌, అర‌కు ఎంపీ […]

నంద్యాల‌లో చంద్ర‌బాబు ఎలా గెలిచాడో చెప్పిన జ‌గ‌న్‌

నెల రోజులుగా తెలుగు ప్ర‌జ‌లంద‌రిని త‌న వైపు మ‌రల్చుకుంది. టీడీపీ, వైసీపీ మ‌ధ్య హోరాహోరీ పోరు జ‌రుగుతుంద‌ని అంద‌రూ అనుకున్నా వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. వైసీపీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్‌రెడ్డి ఏకంగా 27 వేల ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు. ఈ ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న జ‌గ‌న్ అక్క‌డ 13 రోజుల పాటు మ‌కాం వేశారు. అయినా ఆ పార్టీ అభ్య‌ర్థి ఘోరంగా ఓడిపోయారు. నంద్యాల ఉప ఎన్నిక ఫలితంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. […]

పీకే ప్రాధాన్యం వైసీపీలో త‌గ్గిన‌ట్టేనా?

పార్టీలో నేత‌లు ఎంత మంది వ‌ద్ద‌ని చెప్పినా విన‌లేదు! ముందొచ్చిన చెవుల‌కంటే వెన‌కొచ్చిన కొమ్ములే వాడి అన్న చందంగా.. పార్టీలోని సీనియ‌ర్ల‌ను కూడా ప‌క్క‌న‌పెట్టి.. అంద‌రి కంటే ఎంతో ప్రాధాన్య‌మిచ్చారు! ఎంత‌మంది వ్య‌తిరేకించినా.. అవేమీ పట్టించుకోకుండా అంద‌ల మెక్కించారు. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. ఆయ‌న స‌ల‌హాలు విజ‌యానికి ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయ‌ని ఊహల్లో తేలియాడారు. కానీ ఇప్పుడు అవ‌న్నీ నీళ్ల‌పాలు అయిపోయాయి. ఏరికోరి తెచ్చుకున్న వ్యూహ‌క‌ర్త‌ పీకే దెబ్బ‌.. ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌కు గ‌ట్టిగా త‌గిలింది. ఈ […]

వైసీపీని స్మాష్ చేసేందుకు బాబు మాస్ట‌ర్ ప్లాన్‌

పాలిటిక్స్ అన్నాక ఎత్తులు, పై ఎత్తులు కామ‌న్‌. అయితే, 2050 వ‌ర‌కు ఏపీలో అధికారంలో ఉండాల‌ని గ‌ట్టి నిర్ణ‌యం మీదున్న టీడీపీ అధినేత సీఎం చంద్ర‌బాబు ప్లాన్ మాత్రం అదిరిపోతోంది. సాధార‌ణంగా అంద‌రూ ల‌క్ష్యాలు పెట్టుకుంటారు. కానీ, వ్యూహాలు లేక వాటిని సాధించ‌లేక‌.. చ‌తికిల ప‌డుతుంటారు. కానీ, బాబు అలా కాదు.. 2019 అపై 2024. ఇలా ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా ల‌క్ష్యాలు ఏర్పాటు చేసుకుని ఆదిశ‌గా దూసుకుపోతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఇప్పుడు అమ‌లు చేస్తున్న […]

నంద్యాల గుణ‌పాఠం..  జ‌గ‌న్ మారాల్సిందే! 

రాజ‌కీయం అంటేనే ఉగాది ప‌చ్చ‌డి! తీపి, చేదు క‌ల‌యిక‌ల మేళ‌వింపు! నంద్యాల‌లో హోరా హోరీ త‌ల‌ప‌డిన టీడీపీ, వైసీపీల‌దీ ప్ర‌స్తుతం ఇదే ప‌రిస్థితి. ఒక‌రు తీపిని ఆస్వాదిస్తుంటే.. మ‌రొక‌రు చేదు గుళిక మింగ‌క త‌ప్ప‌ని స్థితి. ఏ ఎన్నికైనా.. ఎంత మంది బ‌రిలో ఉన్నా.. గెలుపు ఒక్క‌రినే వ‌రిస్తుంది! అదే ఇప్పుడు జ‌రిగింది. అయితే, ఈ ఎన్నిక‌, ప్ర‌జా తీర్పు.. ఒక్క గెలుపు ఓట‌మికే ప‌రిమితం కాలేదు. ఓ వ్య‌క్తికి అధికారం అప్ప‌గించేసి చేతులు ముడుచుకోలేదు. నంద్యాల […]

నంద్యాల‌లో ఆ ఓటింగ్ సానుభూతికా… వ‌్య‌తిరేకానికా..!

నంద్యాల‌లో పోలింగ్ ముగిసింది. ఓట‌రు తీర్పు ఎలా ఉంటుందో ?  ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. సాధార‌ణంగా ఉప ఎన్నిక అంటే ఓట‌ర్లు పెద్ద ఇంట్ర‌స్ట్ చూప‌రు. ఎవ‌రి ప‌నుల్లో వారు నిమ‌గ్నమైపోతారు. అయితే నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ మాత్రం సాధార‌ణ ఎన్నిక‌ల‌ను త‌ల‌పించేలా జ‌రిగింది. 80 శాతానికి కాస్త అటూ ఇటూగా పోలింగ్ న‌మోదైంది. ఓవ‌రాల్‌గా 79.20 శాతం పోలింగ్ జ‌రిగింది. 2014లో జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో 72.09 శాతం ఓటింగ్ న‌మోదు అయితే […]

అటు అభివృద్ధి.. ఇటు అన్యాయం.. నంద్యాల ఓట‌రు తిక‌మ‌క‌!

నంద్యాల ఉప ఎన్నిక మంచి ఊపుమీదుంది. గ‌తంలో ఎన్నిడూ లేనంత‌గా ఎన్నిక ప్రారంభం అయి రెండు గంట‌లు గ‌డిచాయో లేదో దాదాపు 16% పోలింగ్ న‌మోదైంది. అది కూడా ఓ ఉప ఎన్నిక‌లో కావ‌డంతో ఎన్నిక‌ల సంఘంలో త‌లు పండిన సీనియ‌ర్లు సైతం ఆశ్చ‌ర్య పోతున్నారు. ఇంత వెల్లువ‌లా నంద్యాల ఉప పోరు జ‌రుగుతుంద‌ని వారు అస్స‌లు ఊహించ‌లేదు. ఇంకో మ‌రింత ఆశ్చ‌ర్య‌క‌ర ప‌రిణామం ఏంటంటే.. మంచంలోంచి లేచి తిర‌గ‌లేని ప‌రిస్థితిలో కాటికి కాళ్లు చాపుకున్న వారు […]

జ‌గ‌న్‌పై కేసు న‌మోదుకు ఈసీ ఆదేశం

ఏపీ విప‌క్ష నేత‌గా బాధ్య‌తా యుత స్థానంలో ఉండి.. న‌లుగురికీ ఆద‌ర్శంగా రాజ‌కీయాలు చేయాల్సిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. నోటి దుర‌ద కార‌ణంగా కోరి క‌ష్టాలు కొని తెచ్చుకున్నారు. అది కూడా తాను ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న నంద్యాల ఉప పోరుకు ఎన్నిక జ‌రుగుతు స‌మయంలో కావ‌డంతో ఫ‌లితంపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. విష‌యంలోకి వెళ్తే.. నంద్యాల ఉప ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభించేందుకు ముందు టీడీపీలో క్రియాశీల‌కంగా ఉన్న శిల్పా బ్ర‌ద‌ర్స్‌ని వైసీపీలోకి ఆహ్వానించి టికెట్ […]