ఆ నియోజ‌క‌వ‌ర్గంలో లోకేశ్ పెత్త‌నం

విజ‌య‌వాడ పార్లెమంట‌రీ స్థానం.. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న స్థానం. అందునా ప్ర‌స్తుతం రాజ‌ధాని ప్రాంతం ఈ నియ‌జక‌వ‌ర్గంలో క‌లిసి ఉండడంతో మ‌రింత ప్రాధాన్యం పెరిగింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ నేత కేశినేని నాని ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. ఈయ‌న హ‌యాంలోనే బెంజిస‌ర్కిల్ వ‌ద్ద ప్లైవోర్‌కు పూజ‌లు కూడా జ‌రిగాయి. ఇక‌, దుర్గ గుడి వ‌ద్ద ఫ్లైవోవ‌ర్ నిర్మాణం వేగంగా సాగుతోంది. నాని ఎంపీ అయ్యాక‌, ఇక్క‌డ ఏపీ రాజ‌ధాని వ‌చ్చిన పుణ్య‌మో, ఆయ‌న క‌ష్ట‌ప‌డిన […]

దివాళా దిశ‌గా ల‌గ‌డ‌పాటి ల్యాంకో..!

ప్ర‌ముఖ వ్యాపారవేత్త‌, కాంట్ర‌వ‌ర్సి పొలిటిషీయ‌న్ అయిన విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ్‌గోపాల్‌కు చెందిన ల్యాంకో కంపెనీ ఖేల్ ఖ‌తం కావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. రాజ్‌గోపాల్‌కు చెందిన ప్ర‌ముఖ మౌలిక రంగ సంస్థ ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌ దివాలా ముంగిట నిలిచింది. భారీ స్థాయిలో రుణాలు తీసుకుని తీర్చ‌లేక ఎగ‌వేత‌దారుల లిస్టులో ఉన్న కంపెనీల‌పై దివాలా ప్ర‌క్రియ ప్రారంభించాలంటూ ఇటీవ‌ల ఆ కంపెనీల‌కు రుణాలు ఇచ్చిన బ్యాంకుల‌కు ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. విజ‌య‌వాడ ఎంపీగా […]

క‌ల‌క‌లం: వైసీపీలోకి కేశినేని నాని..!

ఈ వార్త‌లో నిజానిజాలు ఎంత‌న్న‌ది ప‌క్క‌న పెడితే విజ‌య‌వాడ‌లోని ఓ వ‌ర్గం నాయ‌కులు మాత్రం ఇదే ప్ర‌చారం హోరెత్తించేస్తున్నారు. నిన్న‌టి వ‌ర‌కు అధికార టీడీపీ చేప‌ట్టిన ఆక‌ర్ష్ దెబ్బ‌కు విప‌క్ష వైసీపీకి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు, ఒక‌రిద్ద‌రు ఎంపీలు సైకిలెక్కేశారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. వైసీపీ నుంచి టీడీపీలోకి వ‌చ్చిన కొత్త నాయ‌కులు, పాత నాయ‌కుల మ‌ధ్య పొస‌గ‌క పోవ‌డంతో పాత టీడీపీ నాయ‌కులు ఇప్పుడు వైసీపీలోకి జంప్ చేస్తున్నారు. తాజాగా క‌ర్నూలు జిల్లాలో […]

చంద్ర‌బాబుతో టీడీపీ ఎంపీ తాడో.. పేడో..!

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని.. మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కారు. నిన్న బెంజ్ స‌ర్కిల్‌వ‌ద్ద ఫ్లైవోవ‌ర్‌కి శంకు స్థాప‌న చేసిన సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయ‌న ర‌వాణా శాఖ‌పై ఓ రేంజ్‌లో ఫైర‌య్యాడు. అవినీతికి చిరునామాగా ర‌వాణా శాఖ ఉంద‌ని భారీ కామెంట్ చేశాడు. నిజాయితీ గ‌ల టీడీపీ కార్య‌క‌ర్త‌గా తాను సిగ్గుప‌డుతున్నాన‌ని అన్నారు. ర‌వాణా శాఖ అవినీతి వ‌ల్లే ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌ని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ఇవ‌న్నీ చూస్తుంటే.. కేశినేని ఇదంతా ఏదో వ్యూహం ప్ర‌కారం చేస్తున్న‌ట్టే […]

టీడీపీకి సైకిల్ క‌ష్టాలు

తెలుగు రాజ‌కీయాల్లో సుస్థిర‌మైన స్థానం సంపాదించుకున్న ఘ‌న‌త తెలుగుదేశం పార్టీది. దివంగ‌త మాజీ సీఎం, టీడీపీ వ్య‌వ‌స్థాప‌క‌స‌భ్యుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం తెలుగు గ‌డ్డ‌పై ద‌శాబ్దాల పాటు అప్ర‌తిహ‌తంగా జైత్ర‌యాత్ర కొన‌సాగిస్తోన్న జాతీయ కాంగ్రెస్‌ను మ‌ట్టిక‌రిపించి తెలుగు ప్ర‌జ‌ల హృద‌యాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ సైకిల్ గుర్తును త‌న పార్టీ ఎన్నిక‌ల చిహ్నంగా ఎంచుకున్నారు. నాడు ఎన్టీఆర్ సీఎంగా సైకిల్‌పైనే అసెంబ్లీకి వెళ‌తాన‌ని చెప్పి అలాగే చేసి రికార్డు సృష్టించారు. ఆ […]

ల‌గ‌డ‌పాటి స్కెచ్ టీడీపీ ఎంపీకా..వైసీపీ ఎమ్మెల్యేకా..!

ద‌శాబ్దం పాటు ఏపీలో కీల‌క‌మైన కృష్ణా జిల్లా రాజ‌కీయాల‌ను శాసించిన విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ్‌గోపాల్ గ‌త ఎన్నిక‌లకు ముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభ‌జ‌న చేయ‌డంతో రాజ‌కీయాల‌పై విర‌క్తితో ఆయ‌న వాటికి దూర‌మ‌య్యారు. ప‌దేళ్ల‌పాటు విజ‌య‌వాడ ఎంపీగా ఉన్న ల‌గ‌డ‌పాటి ఇటు స్టేట్ పాలిటిక్స్‌లో కింగ్‌. అటు జాతీయ‌స్థాయిలోను స‌త్తా చాటారు. మీడియాలో ఎక్క‌డ చూసినా ల‌గ‌డ‌పాటి హంగామా చాలా ఎక్కువ‌గానే ఉండేది. అలాంటి ల‌గ‌డ‌పాటి వాయిస్ ఇప్పుడు చాలా త‌క్కువుగా మాత్ర‌మే వినిపిస్తోంది. […]

వైసీపీలో ప్ర‌శాంత్ కిషోర్ ప‌ని స్టార్ట్‌! అన్ని మార్చాల్సిందే..

ఎప్పుడెప్పుడా అని వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నేత‌లు ఎదురు చూస్తున్న ఏపీలో వైసీపీ కార్యాల‌యం ఏర్పాటు ప్ర‌క్రియ ప‌ట్టాల‌మీద‌కి ఎక్కింది. రాబోయే రెండు మూడు నెల‌ల్లోనే కార్యాల‌యం అందుబాటులోకి రానుంది. 2019లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ పార్టీని అధికారంలోకి తీసుకురావాల‌ని వెయ్యి ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు వెళ్తున్న జ‌గ‌న్‌.. మోడీకి ఎన్నిక‌ల ప్లాన్ ఇచ్చి.. అధికారంలోకి తెచ్చిన ప్ర‌శాంత్ కిషోర్‌ను ఈ ద‌ఫా త‌న‌కు స‌ల‌హాదారుగా నియ‌మించుకున్నారు. ఈ నెల 1 న త‌న విధుల్లో చేరిపోయిన ప్ర‌శాంత్ […]

బ్రాహ్మ‌ణి దెబ్బ‌తో ఇద్ద‌రు ఎంపీల‌కు టెన్ష‌న్‌…టెన్ష‌న్‌

ఏపీలో అధికార టీడీపీకి చెందిన ఇద్ద‌రు ఎంపీల‌కు చంద్ర‌బాబు కోడ‌లు బ్రాహ్మ‌ణి టెన్ష‌న్ ప‌ట్టుకున్న‌ట్టే అక్క‌డ రాజ‌కీయ ప‌రిణామాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. ప్ర‌స్తుతం లోకేశ్ మంత్రి అయినా తెర‌వెన‌క త‌తంగాన్ని మొత్తం చ‌క్క‌పెడుతోన్న బ్రాహ్మ‌ణికి మంచి నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌న్న టాక్ ఆల్రెడీ వ‌చ్చేసింది. ఈ నేప‌థ్యంలోనే కోడ‌లిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దించాల‌ని చంద్ర‌బాబు డైరెక్టుగా కాక‌పోయినా అప్పుడే చాప‌కింద నీరులా త‌న ప్ర‌య‌త్నాలు స్టార్ట్ చేసేశారు. లోకేశ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగూ […]

బీజేపీలో కేశినేని మంట‌

ఏపీలో అధికార ప‌క్షంలో ఉన్న టీడీపీ, మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ మ‌ధ్య మాట‌ల మంట రేగుతోంది. గ‌త మూడేళ్లుగా ఈ రెండు పార్టీల నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా బీజేపీతో పొత్తు వల్లే మెజారిటీ తగ్గిందంటున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్య‌లు రెండు పార్టీల మ‌ధ్య మ‌రింత‌గా మంట రేపుతున్నాయి. తాజాగా ఎంపీ కేశినేని వ్యాఖ్య‌ల‌పై బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష‌నేత‌, విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తీవ్రంగా స్పందించారు. బీజేపీతో పొత్తు వ‌ల్లే […]