పవన్ బాబా ‘ప్రత్యేక’ పురాణం

ఎట్టకేలకు ప్రశ్నించే నాయకుడు స్పందించాడండోయ్..ప్రశించాడనేలేదు ఇక్కడ కేవలం స్పందించాడు.ఈయన స్పందించే నాయకుడో ప్రశ్నించే నాయకుడో అర్థం కావడం లేదు.ఈపాటికి అర్ధమయ్యే ఉంటుంది ఆయనే జనసేన అధ్యక్షుడు ప్రశ్నించడానికే పుట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ప్రత్యేక హోదా అంశం పైన చాలా కూల్ గా చాలా రిలాక్స్డ్ గా స్పందించారు పవన్.ఒక పక్క పార్లమెంట్ లో బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వం మొర్రో అని గొంతు చించుకు అరుస్తుంటే..ఇంకోవైపు రాష్ట్ర ప్రజానీకం అంతా ఏకమై ప్రత్యేక […]

మాగంటి గారి గెడ్డం నిర‌స‌న‌

స్వతంత్ర దేశంలో అహింసాయుత నిర‌స‌న‌ల్లో ఇదో ట్రెండ్… మాగంటి గారి గెడ్డం నిర‌స‌న‌. ..ఏపీకి ప్రత్యేక హోదా విషయం రాష్ట్ర ఎంపీల‌ను ఎంత‌గా ఉక్కిరిబిక్కిరి చేసేస్తోందో చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్… హోదాపై ఇప్పటి వ‌ర‌కు అనేక రూపాల్లో అధికార ప‌క్ష ఎంపీలు, విప‌క్ష వైకాపా ఎంపీలు త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేశారు. అయితే, ఇప్పుడు ఇక‌, వ్య‌క్తిగ‌తంగా కూడా కేంద్రంపై నిర‌స‌న తెలిపేందుకు సిద్ధ‌మైపోయారు అధికార ప‌క్ష ఎంపీలు. ఇప్ప‌టికే చిత్తూరు ఎంపీ, సినీ న‌టుడు శివ‌ప్రసాద్‌.. […]

‘త్వరలో’ అంటే పదేళ్ళు సరిపోద్దా!

త్వరలో ప్రత్యేక హోదాపై స్పష్టత రావచ్చునని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి. ఈలోగా తొందరపాటు నిర్ణయాలు తగవనీ, ఆందోళనల వల్ల ఉపయోగం లేదని, నరేంద్రమోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ని ప్రత్యేకంగా చూస్తోందని ఈ కేంద్ర మంత్రులు చెబుతున్నారు. కానీ ప్రత్యేక హోదా వస్తుందని నమ్మి భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తమకు హోదా రాక తీవ్ర నిరాశ చెందుతున్నమాట వాస్తవం. ఇప్పటికి కూడా ప్రత్యేక హోదా […]

చంద్రబాబు తలంటు పోసేశారు నిజమే!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాజ్యసభలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రైవేటు మెంబర్‌ బిల్లుపై ఓటింగ్‌ జరగకుండా బిజెపి వ్యూహాల్ని అమలు చేస్తే, ఆ వ్యూహాలు విజయవంతమైనప్పుడు సుజనా చౌదరి బల్లలు చరుస్తూ ఆమోదం తెలపడం వివాదాస్పదమయ్యింది. మిగతా అంశాల్లో అయితే సుజనా చౌదరి తీరుని చంద్రబాబు సమర్థించేవారే. కానీ అక్కడ ప్రత్యేక హోదా అంశంపై ప్రవేశపెట్టిన బిల్లు కావడంతో వివాదం తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకుంది. దాంతో చంద్రబాబు, […]

ప్రత్యేక హోదా కథ ముగిసినట్టే నా?

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కథ ముగిసినట్లే భావించాలి. ద్రవ్యబిల్లు అనే సాకుతో రాజ్యసభలో ఈ బిల్లుపై ఓటింగ్‌ జరగకుండా చేయడంలో భారతీయ జనతా పార్టీ సఫలమయ్యాక, కాంగ్రెసు పార్టీ అయినా ఇంకొక పార్టీ అయినాసరే ఏ మార్గంలోనూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అవకాశం లేకుండాపోయింది. మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ నుంచి ఈ విషయంలో భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు లభిస్తోంది. ‘అంతకు మించి’ అంటూ అసలుదానికి పాతరేయడం ద్వారా టిడిపి, బిజెపి ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం చేస్తున్నాయనే […]

ఇంకా ఆశల పల్లకిలోనే ప్రత్యేక హోదా

ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే విషయమై కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ వైఖరి తేలిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు, టిడిపి ఎంపిల సమావేశంలో కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడి ఎటువంటి హామీని ఇవ్వలేదని సమాచారం. దాంతో ఏపికి ప్రత్యేకహోదా రాదన్న విషయం మరోసారి స్పష్టమైపోయింది. జాతీయ పార్టీలన్నీ రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ స్పష్టంగా చెప్పినా భాజపా పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు, టిడిపి ఎంపిలు విడివిడిగా ప్రధానమంత్రిని కలిసి మాట్లాడిన తర్వాత కూడా హోదాకు కమలనాధులు సానుకూలంగా స్పందిచాలని […]

ఓ స్త్రీ రేపు రా!

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశం ‘ఓ స్త్రీ రేపు రా’ అన్నట్లుగానే ఉంది. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవ్వలేం అని చెబుతూనే ‘ఇంకా ఉంది’ అని చెబుతూ కేంద్రం తాత్సారం చేస్తుంది గనుక. ఇచ్చేది లేదని చెప్పిన తరువాత అదే మాటకు కట్టుబడి ఉండాలి. అయితే ఆంధ్రప్రదేశ్‌ నుంచి పెరుగుతున్న ఒత్తిడితో ‘పరిశీలిస్తున్నాం’ అనే మాట చెబుతున్నారు. ఆ పండగ, ఈ పండగ అన్నారు. అన్నీ వెళ్ళిపోయినయ్‌. అమరావతి శంకుస్థాపన వేదికపై నరేంద్రమోడీ ప్రకటిస్తారనే ప్రచారం జరుగగా […]

కేంద్రంపై గర్జించిన నందమూరి సింహం

వాళ్ళు కాదు..వీళ్ళు కాదు విమర్శంటే నందమూరి నటసింహం బాలయ్యే చెయ్యాలి.అంత ఘాటుగా ఉంటుంది బాలయ్య ప్రేమయినా విమర్సయినా.అందులోను ఆంధ్ర ప్రజలంతా రగిలిపోతున్న ప్రత్యేక హోదా అంశం అంటే బాలయ్య మరింత ఘాటుగా స్పందించారు.కేంద్రం పై బాలయ్య చేసిన విమర్శనాత్మక కవిత్వం తెలుగోడిలో ఇంకా పౌరుషం చచ్చిపోలేదని ఆ వాడి వేడి ఇంకా తగ్గలేదని గుర్తు చేస్తోంది. బాలకృష్ణ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురం నియోజక వర్గ పరిధిలోని పలు అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు సచివాలయం […]

సోలో క్రెడిట్‌ వైఎస్‌ జగన్‌దే

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా బంద్‌ విజయవంతమైంది. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనడంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ ఇంకా ఉత్సాహంగా బంద్‌ని విజయవంతం చేసింది. ముందస్తుగా పార్టీ నాయకుల్ని సమాయత్తం చేసిన వైఎస్‌ జగన్‌, ఈ బంద్‌ని సంపూర్ణంగా విజయవంతం చేసి కేంద్రానికి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ప్రత్యేక హోదా కోసం ఉంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారో తెలియజేశారు. తద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆవేదన కేంద్రానికి అర్థమయ్యేలా చేయడంలో వైఎస్‌ జగన్‌ విజయం సాధించగలిగారని చెప్పడం నిస్సందేహం. […]