వేడుకలు సీమకి అభివృద్ధి అమరావతికి!

అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్న చందాగా తయారైంది రాయలసీమ అభివృద్ధి వ్యవహారం.ఒకప్పటి రాయలు పాలించిన రతనాల సీమ నేడు పాలకుల నిర్లక్ష్యానికి గురై అంతకంతకు వెనుకబడిపోతోంది.రాయలసీమ అంటే కేవలం ముఖ్య మంత్రుల్ని సప్లై చేసే ఫ్యాక్టరీ గానే చూస్తున్న తరుణం లో దివంగత ముఖ్యమంత్రి YS రాజశేఖర రెడ్డి గారు అది నిజం కాదని నిరూపిస్తూ రాయసీమను కరువు కోరల్లోంచి రక్షించేందుకు అనేక తాగు,సాగు నీటి ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టాడు.ఒక్క ప్రాజెక్టులే కాదు విద్య,వైద్య,పారిశ్రామిక […]

లండ‌న్ కోర్టు, సింగ‌పూరోడు:చంద్ర మాయ

ఏపీ రాజ‌ధాని నిర్మాణ వ్యవ‌హారాన్ని స్విస్ చాలెంజ్ ప‌ద్ధతిలో చంద్రబాబు ప్రభుత్వం సింగ‌పూర్ క‌న్సార్టియానికి క‌ట్టబెట్టింది. అదే సంద‌ర్బంలో న్యాయ‌ప‌ర‌మైన ఇబ్బందుల‌న్నీ లండ‌న్ కోర్టులో తేల్చుకోవాల‌ని ఒప్పందం చేసుకుంది. అంటే భ‌విష్యత్తుల్లో సింగ‌పూర్ క‌న్సార్టియం లాభాల‌కు గ్యారంటీ ఇచ్చిన ప్రభుత్వం ఒక‌వేళ ప‌రిస్థితులు తార‌మార‌యితే మాత్రం లండ‌న్ కోర్టు బోనెక్కాల్సి ఉంటుంది. ఏపీ ప్రభుత్వం అంటే మ‌నంద‌రి ప‌రిస్థితి దోషులుగా నిల‌వాల్సి ఉంటుంది. సింగ‌పూర్ కంపెనీల లాభాల కోసం మ‌న రాజ‌ధాని క‌డుతున్న చందంగా ప‌రిస్థితులు మార్చేసిన […]

ఓ రెడ్డి ఓ కాపు ఓ మైనారిటీ- ఇదీ బాబు లెక్క

రాజకీయాల్లో చంద్రబాబు రాజకీయమే వేరయా..ఇది ఇవ్వాల్టి మాట కాదు. రామ రావు గారిని గద్దె దించడానికి వైస్రాయ్ హోటల్ లో రాజకీయం చేసిన రోజులనుండి వినిపిస్తున్న మాటే ఇది. చంద్రబాబు వ్యక్తుల్ని పెద్దగా నమ్మరు అనేది అయన సన్నిహితులే చెప్పే మాట. ఆయన పలురకాల సమీకరణాలకు అధిక ప్రాధాన్యతనిస్తుంటారు. ఆ సమీకరణాల్లో భాగంగానే ఎవరికైనా ఏదయినా పదవి దక్కాల్సిందే తప్ప వ్యక్తిగత ఎదుగుదలతో ఎంత చేసినా బాబు సమీకరణాలముందు అదంతా బేజారె. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాలంటే […]

చంద్రబాబా మజాకా: వీర్రాజు అవుట్

ఎక్కడైనా సొంత పార్టీ వ్యవహారాల్ని పార్టీ అధ్యక్షుడు చక్కబెట్టడం మనం చూస్తుంటాం కానీ పక్క పార్టీ వాళ్ళు ఎవరికీ ఏ పోస్ట్ ఇవ్వాలో ఎవరిని పక్కకు తప్పించాలో కూడా చంద్రబాబు కనుసన్నల్లో జరగడం ఇప్పుడు చూస్తున్నాం.ఇదంతా బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడి ఎన్నిక గురించే. రాష్ట్రంలోని మెజారిటీ నేతలు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సోము వీర్రాజును ఎంపిక చేస్తే బాగుంటుందని సూచించారు. అందుకు జాతీయ నాయకత్వం కూడా ఆమోదముద్ర వేసింది. అయితే, చివరి నిముషంలో అధ్యక్షునిగా వీర్రాజు ప్రకటన […]

తెలంగాణ రెడ్డి పై బాబుకు ఎందుకంత ప్రేమ?

చంద్రబాబు ఒకరి మీద ప్రేమ చూపించినా వారికే డేంజర్..ఒకరు చంద్రబాబు మీద ప్రేమ చూపించినా వారికే డేంజర్..ఇది ఈ నాటి కథ కాదు.చంద్రబాబు రాజకీయ జీవితం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎవరికైనా అర్థమయ్యేది.అందుకే స్వర్గీయ నందమూరి తారక రామ రావు దగ్గరినుండి తెలుగుదేశం పార్టీ ని హస్తగతం చేసుకున్న చంద్రబాబు ఆ నాటి నుండి ఈ నాటి వరకు పార్టీ లో తానే నెంబర్ 1 గా కొనసాగుతున్నాడు.ఇంకో నెంబర్ కి ఛాన్స్ లేదు.ఒకటి నుండి 10 వరకు […]

చినబాబు చూపు ఢిల్లీ వైపు!

చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఢిల్లీ లో పాగా వేసేందుకు సిద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తోంది.ఢిల్లీ లో ఏపీ ప్రతినిధిగా లోకేష్ బాబును నియమించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం.దీనిపై ఇప్పటికే పార్టీ లో అంతర్గతంగా చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.కాగా ప్రస్తుత ఏపీ ప్రతినిధిగా ఉన్న కంభంపాటి రామ్మోహన్‌రావు పదవీకాలం నెలక్రితమే పూర్తయినా, ఇప్పటివరకూ అధికార ప్రతినిధిగా ఎవరినీ నియమించకపోవడం కూడా ఈ వాదనకు బలం చేకూరుతోంది. లోకేష్ ని ఢిల్లీకి పంపడం పై పార్టీలోనే […]

చంద్రబాబు నెంబర్ వన్ గేమ్ షో

అభివృద్ధి సంగతి దేవుడెరుగు,అంకెల గారడీయే ముఖ్యం అన్న చందాగా తయారయ్యింది చంద్రబాబు వెంపర్లాట చూస్తుంటే.ఏ సమీక్షలు జరిగినా,ఏ రంగంలో చూసినా నంబర్‌-1 స్థానంపైనే మాట్లాడుతున్నారు కానీ వాస్తవిక అభివృద్ధి,క్షేత్ర స్థాయిలో ఆ రంగ వాస్తవ అభివృద్ధి ఏమిటన్నది ప్రభుత్వం ఆలోచించడం లేదన్నది వాస్తవం. కొద్దిరోజులుగా ఏ ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించినా ఈ నంబర్ గేమ్ సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.దీనిపై అధికారులు సైతం విస్తుపోతున్నారు.ఈ అంకెల గారడీ అంతా వాస్తవానికి దూరంగా జరుగుతోంది.ఇక ఈ మధ్య బాగా చర్చనీయాంశం […]

మోడీ ర్యాంకింగ్స్:కేసీర్ No1 మరి బాబు?

ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోడీ షాకిచ్చారు. ఈ విషయంలో కేసీఆర్ మాత్రం హ్యాపీగా ఉన్నారు. అదేంటి అనుకుంటున్నారు. ప్రతి మూడు నెలలకు రాష్ట్రాల పనితీరుపై ముఖ్యమంత్రులకు ప్రధాని మోడీ ర్యాంకులిస్తారు. వివిధ వర్గాలు, ప్రభుత్వ నిఘా సంస్థలు, ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా సమాచారం సేకరించి విశ్లేషిస్తారు. అలా సేకరించిన సమాచారం ఆధారంగా సీఎంలకు ర్యాంకులిస్తారు. ఈసారి మోడీ కేటాయించిన ర్యాంకుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఫస్ట్ ప్లేస్ వచ్చిందట. దేశంలో ప్రజాభిమానం ఉన్న ముఖ్యమంత్రుల్లో […]

పట్టిసీమ:చుక్క నీరు రాలేదు బాబూ..

అధికార పార్టీ ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన పట్టిసీమ ముచ్చటగా మూడోసారి గండి పడింది. ప్రారంభించడం ఆ వెంటనే ఏదో ఒక సమస్యతో ఆపేయడం గత మూడు సార్లు ఇదేతంతు. ఎక్కడైనా ఏ కొత్త ప్రాజెక్టునైనా పూర్తయిన తరువాత జాతికి అంకితం చేయడం మనం చూస్తాం. కానీ మన చంద్రబాబు లోకానికి విరుద్ధంగా ఆలు లేదు చూలు లేదు ఆరంభించేద్దాం అన్న చందాగా తయారయ్యారు. అది పట్టిసీమయినా సరే అమరావతి సచివాలయం అయినా సరే. ప్రారంభించడం జాతికి అంకితం చేయడం […]