అంతెత్తున ఎగిసిన కాపు ఉద్యమం చప్పగా చల్లారిపోయింది. అప్పట్లో వార్తల్లో నిలిచిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పేరు.. ఇప్పుడు వినిపించడమే మానేసింది. ప్రస్తుతం బడ్జెట్లో కాపు కార్పొరేషన్కు రూ.1000కోట్లు కేటాయించి.. ఏపీసీఎం చంద్రబాబు తన మార్క్ మరోసారి చూపించారు. కాపులకు అన్యాయం జరుగుతోందని విమర్శిస్తున్న వారు కిక్కురుమనకుండా చేసేందుకు.. కాపు ఉద్యమాన్ని మరింత నీరుగార్చేందుకు ఇప్పుడు బాబు సరికొత్త వ్యూహంతో చంద్రబాబు రంగంలోకి దిగుతున్నారు. కాపుల తరఫున ముద్రగడ పద్మనాభంఉద్యమిస్తున్నా… అడుగడుగునా ఆ ఉద్యమాన్ని అణిచివేయడానికే […]
Tag: AP
చంద్రబాబు రాజీ చేసినా తీరు మారని నాయకులు … తక్షణం కర్తవ్యం?
ఏపీలో అధికార టీడీపీకి నాయకుల మధ్య గొడవలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిందన్నమాటే గాని చంద్రబాబుకు నాయకుల మధ్య గొడవలు సర్దుబాటుతోనే సగం కాలం గడిచిపోతోంది. టీడీపీ వర్సెస్ టీడీపీ నాయకులతో పాటు టీడీపీ వర్సెస్ బీజేపీ నాయకుల మధ్య అస్సలు పొసగడం లేదు. ఈ క్రమంలోనే పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా కొనసాగుతోన్న పైడికొండల మాణిక్యాలరావుతో పాటు జిల్లా పరిషత్ […]
టీడీపీ 3 – వైసీపీ 0…. ఓటమి జగన్కు రాజకీయంగా పెద్ద దెబ్బే
ఏపీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీడీపీ తన దూకుడు చూపించింది. స్థానిక సంస్థలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడప, కర్నూలుతో పాటు నెల్లూరు ఎమ్మెల్సీలను టీడీపీ కైవసం చేసుకుంది. శుక్రవారం ప్రారంభమైన కౌంటింగ్లో ముందుగా నెల్లూరుతో టీడీపీ బోనీ కొట్టింది. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి వైసీపీ అభ్యర్థి ఆనం విజయ్కుమార్రెడ్డిపై 87 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే టీడీపీ అభ్యర్థి […]
నంద్యాలలో చంద్రబాబు మైండ్ బ్లాక్ చేసిన జగన్
ఇటీవల ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణం చెందడంతో అక్కడ ఐదారు నెలల్లో ఉప ఎన్నిక జరగనుంది. నంద్యాల ఉప ఎన్నిక ప్రస్తావన అప్పుడే ఏపీ రాజకీయవర్గాల్లో చర్చకు వస్తోంది. దీనిపై విపక్ష వైసీపీ అధినేత జగన్ ముందుగానే డెసిషన్ తీసేసుకున్నారు. నంద్యాల సీటు తమదే అని…అక్కడ నుంచి వైసీపీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని ప్రకటించడంతో నంద్యాలలో ఉప ఎన్నిక ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ క్రమంలోనే చంద్రబాబు ఇక్కడి నుంచి […]
రుణ`మాఫీ`తో ఇద్దరు చంద్రులకు చెక్
తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయడానికి బీజేపీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో భారీ విజయం సాధించిన తర్వాత.. ఆ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం రైతులకు `రుణమాఫీ` చేస్తుందని, ఆభారం కేంద్రమే భరిస్తుందని చేసిన కేంద్రమంత్రి పకటనతో.. ఇప్పుడు ఇద్దరు చంద్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 2014 ఎన్నికల్లో రుణమాఫీ నే ప్రచారంగా చేసుకుని అటు చంద్రబాబు, ఇటు కేసీఆర్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇప్పుడు అదే అస్త్రాన్ని 2019 ఎన్నికల్లో ఉపయోగించే దిశగా కేంద్రం అడుగులేస్తోంది. […]
భూమా వర్గాన్ని బలహీనం చేస్తుంది ఎవరు?
నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణంతో.. ఆయన వర్గం దిక్కలేనిది అయిపోయింది. ఇప్పటివరకూ నంధ్యాలలో పరిస్థితిని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక తీవ్రంగా మధనపడింది పార్టీ అధిష్ఠానం! ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటి వరకూ బలంగా ఉన్న భూమా వర్గాన్ని బలహీనం చేసేందుకు వెనుక నుంచి శర వేగంగా పావులు కదుపుతోంది. నంద్యాల రాజకీయాలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఆసక్తికరంగా మార్చేశారు. భూమా నాగిరెడ్డి మరణం తరువాత ఉప […]
2019 వార్: ఏపీ-తెలంగాణలో రాజకీయాలను శాసిస్తున్న కులాలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడి అప్పుడే మూడేళ్లు గడిచిపోయింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి మధ్యలో జరిగే చిన్నా చితకా ఎలక్షన్లతో పాటు 2019 ఎన్నికలపైనే ఉంది. 2019లో ఏపీ, తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుంది ? ఏ పార్టీల మధ్య ప్రధానంగా పోరు ఉంటుంది ? అసలు ఎవరి బలం ఎంత? ఎవరి బలగం ఎంత? ఒంటరిగా బరిలో నిలిచి ఒకే పార్టీ అధికారం దక్కించుకునే అవకాశం ఉందా ? ఇలా ఎన్నో ప్రశ్నలు […]
నంద్యాల టీడీపీ క్యాండెట్ ఖరారు..!
ఏపీలో మరో ఉప ఎన్నికకు రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. 2014లో సాధారణ ఎన్నికల తర్వాత మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల టైంలోనే మృతిచెందిన శోభా నాగిరెడ్డి స్థానంలో ఆమె కుమార్తె అఖిలప్రియ ఏకగ్రీవంగా గెలవగా, కృష్ణా జిల్లా నందిగామలో మృతిచెందిన తంగిరాల ప్రభాకర్రావు కుమార్తె సౌమ్య విజయం సాధించారు. ఇక తిరుపతిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మున్నూరు వెంకటరమణ మృతి చెందగా అక్కడ జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య సుగుణమ్మ లక్ష […]
ఏపీలో ఆ 3 ఎమ్మెల్సీలు టీడీపీకా …వైసీపీకా..!
ఏపీలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా స్థానిక సంస్థల కోటాకు సంబంధించిన మూడు జిల్లాల్లో శుక్రవారం పోలింగ్ జరుగుతోంది. స్థానిక సంస్థల కోటాలో మొత్తం 9 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా అందులో 6 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇక వైసీపీకి మంచి బలం ఉన్న జగన్ సొంత జిల్లా కడపతో పాటు కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. కడప జిల్లాలో జగన్ తన సొంత బాబాయ్ […]