ఏపీలో ఓ ఛానెల్ – తెలంగాణ‌లో ఓ ఛానెల్ ఎంట్రీ

తెలుగు మీడియా రంగంలో ఉన్న‌న్ని ఛానెళ్లు దేశంలో జాతీయ మీడియాలో తప్పా ఏ స్టేట్‌లోను లేవు. తెలుగులో లెక్క‌కు మిక్కిలిగా మీడియా ఛానెల్స్ పుట్టుకొస్తున్నాయి. చాలా ఆర్భాటంగా స్టార్ట్ అవుతోన్న ఛానెల్స్‌లో కొన్ని మూత‌ప‌డుతుంటే కొన్ని ఛానెల్స్ మాత్రం నామ్ కే వాస్తేగా ఉన్నామంటే ఉన్నామ‌నిపించుకుంటున్నాయి. తెలుగులో ఎన్ని ఛానెల్స్ వ‌స్తున్నా కేవ‌లం టీవీ-9, ఎన్టీవీ, టీవీ-5, ఏబీన్‌, ఈటీవీ వీటితో పాటు ఒక‌టీ అరా ఛానెల్స్ మిన‌హా మిగిలిన ఛానెల్స్ ఏవీ సిబ్బందికి జీతాలు ఇచ్చే […]

రోజా ఇలాకాలో టీడీపీకి లీడ‌ర్ లేడా..!

సీఎం చంద్ర‌బాబు, టీడీపీ నాయ‌కుల‌పై విమ‌ర్శ‌లు గుప్పించి.. నిత్యం వార్త‌ల్లో నిలిచే వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా నియోజ‌క‌వ‌ర్గ‌మైన న‌గ‌రిలో టీడీపీ ప్రాభవం కోల్పోతోంది. అక్క‌డ అధికారంలో లేక‌పోయినా.. నిధులు మంజూరు చేసుకుని పార్టీ ప‌టిష్ట‌త‌పై దృష్టిసారించాల్సిన నేత‌లు.. కేవ‌లం విమ‌ర్శ‌ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు. దీంతో పార్టీ ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా మారుతోంది. ఆమెపై పోటీ చేసి ఓడిపోయిన‌.. గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు ఎమ్మెల్సీ అయినా.. ఇప్ప‌టికీ జిల్లాల్లో కీల‌క‌మైన ప‌ద‌వులు భ‌ర్తీ చేయ‌డంలో వెన‌క‌డుగు వేస్తున్నారు. నాయ‌కుల నిర్లక్ష్యంతో […]

హోదా కంటే పున‌ర్విభ‌జ‌నే బాబుకు ఎక్కువా..?

`నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌ప‌న ఎప్పుడు చేస్తారు? వీలైనంత త్వ‌ర‌గా దీనిని చేప‌ట్టండి` అంటూ కేంద్ర పెద్ద‌ల‌ను క‌లిసిన‌ప్పుడ‌ల్లా ఏపీ సీఎం చంద్ర‌బాబు ప‌దే ప‌దే వారిని స‌ర్దిచెబుతున్నారు. ఆయ‌న‌కు కుద‌ర‌క‌పోతే.. టీడీపీ ఎంపీల‌తో కేంద్రంలోని బీజేపీ పెద్దల‌తో మంతనాలు జ‌రిగేలా చూస్తున్నారు. ఎలాగైనా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి నియోజ‌క‌వ‌ర్గాల పెంపు జ‌రిగి తీరాల‌ని తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. హోదా విష‌యంలో ఇంత‌ట గ‌ట్టిగా ప్ర‌య‌త్నించ‌ని ఆయ‌న‌.. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌పై ప‌డుతున్న ఆరాటం చూసి అంతా ఆశ్చ‌ర్య‌ప‌డుతున్నారు. హోదా విష‌యంలో ఇంతలా […]

ఆ మంత్రి డైరెక్ష‌న్‌లో నారా లోకేష్‌..!

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ఇటీవ‌లే మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. నారా లోకేశ్‌కు మంత్రి అయ్యేనాటికి రాజ‌కీయ అనుభ‌వం ఎంత అని లెక్క వేసుకుంటే మూడు రోజులే అని చెప్పాలి. లోకేశ్ ఎమ్మెల్సీ అయిన మూడు రోజుల‌కే మంత్రి అయ్యాడు. అది కూడా ఆయ‌న‌కు కీల‌క‌మైన పంచాయ‌తీరాజ్‌, ఐటీ శాఖ‌లు చంద్రబాబు అప్ప‌గించారు. ఇక లోకేశ్‌కు ప్ర‌జ‌ల‌తో అటాచ్‌మెంట్ కూడా లేదు. మ‌రి […]

రాజ‌ధానిలో టీడీపీ ప‌ట్టు స‌డ‌లుతోందిగా..

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో రోజు రోజుకు టీడీపీ గ్రాఫ్ త‌గ్గుతోందా ? అక్క‌డ రైతుల నుంచి బ‌ల‌వంతపు భూసేక‌ర‌ణ, ప్ర‌జ‌ల‌కు క‌నీస సౌక‌ర్యాల క‌ల్ప‌న‌లో ప్ర‌భుత్వ వైఫ‌ల్యం, అక్క‌డ సామాన్య జ‌నాల ఇబ్బందులు అడుగ‌డుగునా కొట్టొచ్చిన‌ట్టు క‌న‌ప‌డుతున్నాయి. అయితే ఇదంతా పైకి మాత్ర‌మే క‌న‌ప‌డుతోన్న వ్య‌తిరేక‌త‌…అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వ్య‌తిరేక‌త‌ను అధికారంలో ఉంది కాబ‌ట్టి టీడీపీ ఏదోలా మేనేజ్ చేసుకుంటూ క‌వ‌రేజ్ చేసేసింది. అయితే ఇది ఓట్ల రూపంలో వ్య‌తిరేకంగా వ‌స్తే ఇక క‌వరేజ్ […]

టీడీపీలో న‌ల్లారి ఫ్యామిలీ క‌థ అడ్డం తిరుగుతుందా..!

కాలం క‌లిసి రాక‌పోతే.. అధికార పార్టీలో ఉన్నా.. ఎవ‌రు ఎంత గ‌ట్టిగా ప్ర‌య‌త్నించినా ఫ‌లితం మాత్రం శూన్యం! వీరిని చూస్తే జాలి క‌ల‌గ‌క మాన‌దు! ఇప్పుడు న‌ల్లారి ఫ్యామిలీ వ్యూహాలను గ‌మ‌నిస్తే ఇలాగే అనిపిస్తుంది. రాజ‌కీయాల్లో యాక్టివ్ అవ్వాల‌ని న‌ల్లారి సోద‌రులు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. స‌మైక్యాంధ్ర మాజీ సీఎం న‌ల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి సోద‌రుడు న‌ల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే టీడీపీలో చేరినా.. వారికి విజ‌యం సాధించడం మాత్రం అంద‌ని ద్రాక్షే అని […]

నంద్యాల‌లో టీడీపీకి భారీ షాక్‌..సీమ‌లో బాబు లెక్క తప్పిందా..!

క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాలు టీడీపీ అధినేత‌కు త‌ల‌నొప్పిగా మారాయి. ఇటీవ‌లె మృతిచెందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చేరిక‌తో ఇక్క‌డ విభేదాలు భ‌గ్గుమ‌న్నాయి. భూమా మృతి త‌ర్వాత‌.. నంద్యాల‌లో పూర్తి ప‌ట్టు సాధించాల‌ని భావిస్తున్న శిల్పా వ‌ర్గానికి ఊహించ‌ని ఎదురుదెబ్బ త‌గిలింది. ఉప ఎన్నిక‌ల్లో భూమా వ‌ర్గానికి సీటు కేటాయించాల‌ని అధిష్ఠానం నిర్ణ‌యించ‌డంతో మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహ‌న్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధ‌మైంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ ప‌రిణామంతో […]

బాబు ఇది అమ‌రావ‌తి ఇమేజ్‌కు డ్యామేజ్ కాదా..!

న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తి ఇమేజ్ పెంచేందుకు సీఎం చంద్ర‌బాబు ఎంతో శ్ర‌మిస్తున్నారు. పెట్టుబ‌డులు రావాలంటే కంపెనీలు ముఖ్యం క‌నుక‌.. నిత్యం పారిశ్రామిక వేత్త‌ల‌తో స‌మావేశాలు నిర్వహిస్తున్నారు. ఇంత క‌ష్ట‌ప‌డుతున్నా ఇమేజ్ క‌న్నా డ్యామేజ్ ఎక్కువ‌గా జ‌రుగుతోంది. వ‌రుస‌గా కంపెనీలు ఏపీకి క్యూ క‌ట్టడం మాని.. మూసివేసే స్థితికి చేరుతున్నాయి. మొన్న ఎయిర్ కోస్టా. నిన్న కేశినేని ట్రావెల్స్.. ఇలా వ‌రుస‌గా అన్ని కంపెనీలు టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన మూడేళ్ల‌లో మూసేయ‌డం.. అమ‌రావ‌తి ఇమేజ్‌కు డ్యామేజ్ చేసే అంశాల‌ని […]

టీడీపీలోకి మాజీ సీఎం సోద‌రుడు..?

తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్య‌తిరేకించిన, స‌మైక్యాంధ్ర చివ‌రి ముఖ్య‌మంత్రి న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి మ‌ళ్లీ రాజ‌కీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు తీవ్రంగా ప్ర‌యత్నిస్తున్నారు. జై స‌మైక్యాంధ్ర పార్టీని స్థాపించిన ఆయ‌న‌.. త్వ‌ర‌లో ఏదో ఒక పార్టీలో చేరిపోతారనే ప్ర‌చారం జోరందుకుంది. ఆ మాటెలా ఉన్నా.. ఆయ‌న త‌మ్ముడు న‌ల్లారి కిషోర్‌కుమార్‌ మాత్రం సైకిల్ ఎక్కేందుకు సిద్ధ‌మ‌య్యారు. అతి త్వ‌ర‌లోనే ప‌సుపు కండువా క‌ప్పుకోబోతున్నారు. ఆయ‌న చేరిక‌కు టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని […]