వైసీపీ యువనేత, ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్గా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న రాజమండ్రి ఎంపీ.. వైసీపీ నాయకుడు.. మార్గాని భరత్పై సొంత పార్టీ ఎంపీ.. నరసాపురం నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న రఘురామ కృష్ణ రాజు ఉరఫ్ ఆర్ ఆర్ ఆర్ సటైర్లతో విరుచుకుపడ్డారు. “ఏక చిత్ర నటుడు.. ద్విపాత్రాభినయం“ అంటూ.. సైటర్లు కుమ్మేశారు. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. విషయంలోకి వెళ్తే.. ఇటీవల వచ్చిన పరిషత్ […]
Tag: AP Politics
సీఎం జగన్తో మంచు మనోజ్ భేటీ..వైరల్గా మారిన ట్వీట్!
ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ భేటీ అయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా మనోజ్ ట్విట్టర్ ద్వారా తేలియజేశాడు. ఈ నేపథ్యంలోనే జగన్తో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. ఆయనపై మనోజ్ ప్రశంసల జల్లు కురిపించాడు. `సీఎం జగన్ను కలవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న ప్రణాళికలు.. ముందుచూపు, దూరదృష్టి నన్ను బాగా ఆకర్షించాయి. […]
జగన్.. డిఫరెంట్ పొలిటీషియన్..?
అసంతృప్తి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న వైసీపీ అధినేత రాజకీయం అనేదే ఒక విచిత్రమైన ఆట.. చదరంగంలో వేసే ఎత్తులకంటే పై ఎత్తులు మెరుగ్గా వేయాలి. లేకపోతే అథ:పాతాళానికి నాయకుడు పడిపోతాడు.. ఆ తరువాత ఇక రాజకీయ జీవితం భూస్థాపితం అవుతుంది. అందుకే రాజకీయ నాయకులు నిర్ణయాలు త్వరగా తీసుకోరు.. తీసుకున్నా అమలు చేయరు.. అయితే అందుకు భిన్నంగా వ్యవహరించిన నాయకులు ఎన్టీయార్, నరేంద్రమోదీ.. ఇపుడు వారిని మించి జగన్ పొలిటికల్ గేమ్ ఆడబోతున్నాడు. చూసేవారికి వారి బాటలోనే […]
వైసీపీలో కేవీపీ బావమరిది సత్తా ఎంత ?
పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గ అధికార వైసీపీలో కొద్ది రోజులుగా గ్రూపు రాజకీయాల రగడ జరుగుతోంది. ఇదే నియోజకవర్గానికి చెందిన ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీథర్ – మాజీ ఏఎంసీ చైర్మన్ మేడవరపు అశోక్బాబు ( సీనియర్ పార్లమెంటేరియన్ కేవీపీ రామచంద్రరావు బావమరిది) ఓ వైపు .. చింతలపూడి ఎమ్మెల్యే వీఆర్. ఎలీజా, ఆయన అనుచరులు మరోవైపుగా ఉంటూ రాజకీయం చేస్తూ వస్తున్నారు. ఎంపీగా శ్రీధర్ ఉన్నా చింతలపూడి వరకు అశోక్ వ్యూహాలు పార్టీలో ఎప్పుడూ కీలకంగానే […]
టీడీపీకి బిగ్ షాక్..పార్టీకి గోరంట్ల బుచ్చయ్య గుడ్బై?!
ఆంధ్రప్రదేశ్లో తెలుగు దేశం పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం టీడీపీ ముఖ్యనేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గురువారం నాడు బుచ్చయ్య చౌదరి పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖ రాసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ నాయకత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తి ఉన్నారని, ఆ […]
నారా లోకేష్ అరెస్ట్.. రమ్య కుటుంబానికి మద్దతుగా నిలిచిన టీడీపీ..
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరులో బీటెక్ అమ్మాయి రమ్య ఓ ఉన్మాది చేతిలో స్వాతంత్ర్య దినోత్సవం రోజే దారుణ హత్యకు గురి కావడం బాధాకరం. ఈ ఉదంతంలో రమ్య కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా విద్యార్థిని కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం చెల్లించి, నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అయితే తెలుగుదేశం […]
మంత్రులపై జగన్ అసహనం?
పులిచింతల ప్రాజెక్టులో 16వ నెంబరు గేటు నీటి ఉధ్రుతికి కొట్టుకుపోవడం.. దాని స్థానంలో స్టాప్ లాక్ అమర్చడం లాంటివి జరిగిపోయాయి. అయితే ఈ వ్యవహారం కేబినెట్ మంత్రులకు తలనొప్పి అయి కూర్చుంది. సీఎం జగన్ మంత్రుల వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. ప్రతిపక్ష పార్టీలో ఈ వ్యవహారంపై ఇష్టానుసారం విమర్శలు చేస్తుంటే.. మంత్రలు మాత్రం చూస్తూ ఉండిపోయారని, తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేయడం లేదని ఆయన కోపానికి అసలు కారణం. కనీసం టీడీపీ, బీజేపీలు చేస్తున్న […]
ఢిల్లీ చుట్టూ చక్కర్లు.. అయినా రాలని కాసులు..
ఏపీ ఆర్థికశాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దేశ రాజధాని ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. నెలకు ఒకటి, రెండు సార్లు హస్తినకు వెళ్లి వస్తున్నారు. ఆయన సమయమంతా ఢిల్లీకి వెళ్లి రావడానికే సరిపోతుంది. రాష్ట్రం ఆర్థిక పరిస్థి బాగాలేదు.. నిధులు ఇవ్వండి అని కేంద్రప్రభుత్వాన్ని అడగడానికి, వినతిపత్రాలు ఇవ్వడానికి నిత్యం హస్తినకు వెళుతున్నారు. అయితే డిల్లీ పెద్దలు మాత్రం స్పందించడం లేదు. బుగ్గన పరిస్థితి ఎలా ఉందంటే.. కేంద్ర మంత్రులను కలిస్తే చాలురా దేవుడా.. అనే పరిస్థితి […]
పాపం.. లక్ష్మీపార్వతిపై అంబటికి ఎందుకో అంత కోపం..?
ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమి చైర్మన్ లక్ష్మీపార్వతికి ఇపుడు కొత్త చిక్కొచ్చి పడింది. అంత పెద్ద చైర్మన్ పదవిలో ఉన్న ఆమెను పార్టీలో పెద్దగా పట్టించుకోవడం లేదు. సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అయితే ఆమెను హేళనగా మాట్లాడారట. పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తానంటే.. పెద్దగా నవ్వి.. ప్రధాని, రాష్ట్రపతిలకు కూడా కంప్లైంట్ ఇచ్చుకో అన్నట్లు మాట్లాడాడట. ఇంతకీ విషయం ఏంటంటే.. లక్ష్మీపార్వతికి గుంటూరు జిల్లా ధూళిపాళ్లలో 2.5 ఎకరాల పొలం ఉంది. ఆ పొలాన్ని ఆమె స్థానికంగా […]