ద్వారంపూడి టార్గెట్‌గా పవన్..జనసేన చెక్ పెడుతుందా?

ఏ ఎమ్మెల్యేపైన ఈ స్థాయిలో పవన్ కల్యాణ్ విరుచుకుపడలేదు. ప్రభుత్వ పరంగా విమర్శలు..కొందరు మంత్రులపై ఫైర్ అవ్వడం చేశారు గాని..ప్రత్యేకంగా ఒక ఎమ్మెల్యేని పవన్ ఎప్పుడు పెద్దగా టార్గెట్ చేయలేదు. కానీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని మాత్రం ఓ రేంజ్ లో టార్గెట్ చేశారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. తాజాగా వారాహి యాత్రలో భాగంగా  “ ద్వారంపూడి నువ్వో డెకాయిట్‌.. కాకినాడను నువ్వు డ్రగ్స్‌ డెన్‌గా మార్చావు.. నువ్వు ఎలా గెలుస్తావో చూస్తా.. […]

నెల్లూరుపై టీడీపీ పట్టు..కానీ అవే చిక్కులు.!

వైసీపీ కంచుకోట అయిన నెల్లూరు జిల్లాపై టి‌డి‌పి నిదానంగా పట్టు సాధిస్తుంది. అక్కడ వైసీపీపై వ్యతిరేకత…కీలకమైన ముగ్గురు ఎమ్మెల్యేలు టి‌డి‌పి వైపుకు రావడం, ఇటు నారా లోకేష్ పాదయాత్రతో నెల్లూరుపై టి‌డి‌పి పట్టు సాధించే దిశగా వెళుతుంది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. 10 సీట్లు గెలుచుకున్న సరే నెల్లూరుకు వైసీపీ పెద్దగా చేసిందేమి లేదు. దీంతో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వచ్చింది. ఇదే సమయంలో వైసీపీలో అభివృద్ధి జరగడం లేదని, […]

బాబుకు కొడాలి సవాల్..గుడివాడతోనే చిక్కులు.!

టీడీపీ అధినేత చంద్రబాబుని ఎక్కువగా తిట్టే నాయకుడు ఎవరంటే ఠక్కున కొడాలి నాని పేరు చెప్పేయొచ్చు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కొడాలి..బాబుని బూతులు తిడుతున్నారు. అధికారంలో ఉండటంతో ఆయనని ఎవరు ఏం అనలేని పరిస్తితి. ఇక ఇలా బాబుని దారుణంగా తిడుతున్న కొడాలి..పదే పదే బాబుకు గాని, లోకేష్‌కు గాని దమ్ముంటే గుడివాడలో తనపై పోటీ చేయాలని సవాల్ విసురుతున్నారు. తాజాగా గుడివాడలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవానికి జగన్ ఇచ్చారు. టి‌డి‌పి హయాంలో దాదాపు 80 […]

‘సీఎం’ పవన్..బాబుతో కలిసే వ్యూహం.!

పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యూహం మారిందా? అవకాశం ఇస్తే సీఎంగా పనిచేస్తానని, ఏపీని నెంబర్ 1గా తీర్చిదిద్దుతానని..గత రెండు రోజులు వారాహి యాత్రలో పవన్ చెబుతున్న అంశాలు..పొత్తు విషయంలో క్లారిటీ లేకుండా చేస్తున్నాయి. ఆ మధ్య బలం లేకుండా సీఎం పదవిని అడగనని, ముందు వైసీపీని గద్దె దించడానికి పొత్తులకు వెళ్తానని చెప్పారు. అయితే సి‌ఎం పదవి వద్దు అనడంతో సొంత పార్టీ అభిమానులే అసంతృప్తికి గురయ్యారు. పవన్ సి‌ఎం పదవి వద్దంటే..తాము ఓటు […]

బద్వేలులో టీడీపీ కష్టాలు..వైసీపీకి చెక్ కష్టమే.!

రాయలసీమలో నారా లోకేష్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగిన విషయం తెలిసిందే. సీమలో పాదయాత్ర ముగింపు బద్వేలు నియోజకవర్గంలో జరిగింది. ముగింపు సభలో భారీ ఎత్తున జనం వచ్చారు. అయితే ఆ స్థాయిలో జనం వస్తారని టి‌డి‌పి వాళ్ళు ఊహించి ఉండరు. ఎందుకంటే బద్వేలు అంటే వైసీపీ కంచుకోట. అలాంటి చోట టి‌డి‌పికి మంచి స్పందన వచ్చింది. ఈ స్పందన నేపథ్యంలో ఈ సారి బద్వేలుని ఖచ్చితంగా గెలిచి తీరాలని టి‌డి‌పి నేతలకు నారా లోకేష్ సూచనలు చేశారు. […]

పేర్ని నాని రాజకీయం..వారసుడుకు పవన్ దెబ్బ.!

వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు అంటే..కేవలం ప్రతిపక్షాలని తిట్టడానికే అన్నట్లు ఉన్నారు. మంత్రులుగా వారు రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సేవ చేస్తున్నారు. మాజీ మంత్రులు తమ తమ స్థానాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తున్నారు..పార్టీకి ఏ మేర ఉపయోగపడుతున్నారు? అంటే అవేం లేవు..కేవలం ప్రతిపక్షాలని తిట్టడానికే తాము ఉన్నామనే విధంగా నేతల తీరు ఉంది. అందులో కొడాలి నాని అంటే చంద్రబాబుని తిట్టడానికి, పేర్ని నాని అంటే పవన్‌ని తిట్టడానికి అన్నట్లు ఉన్నారు. వీరు నియోజకవర్గాల్లో ఏం […]

యువతపై లోకేష్ ఫోకస్..టీడీపీకి కలిసొస్తారా?

రాజకీయాల్లో యువత ప్రాధాన్యత ఎక్కువనే చెప్పాలి..వారు గెలుపోటములని పెద్ద స్థాయిలో ప్రభావితం చేస్తారు. యువత ఎటువైపు మొగ్గితే ఆ పార్టీ గెలుపు సులువు అని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని, ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుందని, పెద్ద ఎత్తున కంపెనీలు వస్తాయని, అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి జగన్..యువతని గేలంలో వేసుకున్నారు. యువత కూడా జగన్‌ని నమ్మారు. పెద్ద స్థాయిలో జగన్‌కు ఓటు వేశారు. ఆ తర్వాత జనసేనకు […]

రేవంత్ అదిరే స్కెచ్..జనంలోకి కీలక హామీలు.!

ఈ సారి తెలంగాణలో అధికారంలోకి రావడం అనేది కాంగ్రెస్ పార్టీకి చావో రేవో లాంటి సమస్య..తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఉన్న కాంగ్రెస్..వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోయింది. అధికారం కోల్పోయింది. భారీగా నాయకులని కోల్పోయింది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఓడిపోతే కాంగ్రెస్ మనుగడకే ప్రమాదం. అందుకే ఈ సారి అధికారంలోకి రావడం అనేది చాలా ముఖ్యం. ఆ దిశగానే టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం పనిచేస్తున్నారు. పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్నారు. అందుకే ఎన్నికల […]

కుప్పంలో లక్ష మెజారిటీ..బాబు లెక్కలు ఇవే.!

చంద్రబాబు కంచుకోట కుప్పంపై వైసీపీ ఎలా ఫోకస్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గా వైసీపీ రాజకీయం నడిపిస్తుంది. అధికార బలంతో కుప్పంలో పాగా వేయాలని ప్రయత్నిస్తుంది. మొదట పంచాయితీ ఎన్నికల్లో గెలిచింది. తర్వాత పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటింది. ఆఖరికి కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఇంకా కుప్పం అసెంబ్లీనే కైవసం చేసుకుంటామని అంటుంది. దీంతో చంద్రబాబు అలెర్ట్ అయ్యారు..మామూలుగా తన నామినేషన్ వేయడానికే ఆయన […]