కేసీఆర్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా….!

సిద్దిపేట జిల్లాలో ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు కొనాయిపల్లి వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా.., దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాయి. సిద్దిపేట జిల్లాలో ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచాయి. సీఎం కేసీఆర్ కొనాయిపల్లిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొనాయిపల్లిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం కేసీఆర్ సెంటిమెంట్ ఆలయం. ఏ ముఖ్యమైన కార్యం తలపెట్టినా ఇక్కడి […]

ఢిల్లీలో దోస్తీ… గల్లీలో కుస్తీ… ఇదే ట్రెండ్‌…!

నిన్నటి వరకూ ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్న చందంగా ఉన్న బీజేపీ, వైసీపీ మధ్య సంబంధాలు.. ఇటీవల నువ్వా, నేనా అన్న రీతిలో మారాయి. వైసిపి నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాన్ని రాష్ట్ర బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, మద్యం, ఇసుక వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించిన బీజేపీ.., విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తికి ఏకంగా లేఖ రాసింది. ఇదిలా […]

సుప్రీం తీర్పుపై టీడీపీ నేతల్లో ఉత్కంఠ..!

చంద్రబాబు కేసులో సుప్రీం కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అవినీతి నిరోధక చట్టంలోని 17 ఏ చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అనే అంశం పై సుప్రీంకోర్టు వెలువరించే నిర్ణయం కోసం ఆంధ్రప్రదేశ్ లో అన్ని రాజకీయపక్షాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి. చంద్రబాబు పై నమోదు చేసిన కేసులు చెల్లవని, 17 ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోలేదని చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పి దాఖలు చేశారు. దీని పై సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. […]

రెండున్నర గంటల భేటీ… ఏం మాట్లాడుకున్నారో…?

జైలు నుంచి మధ్యంతర బెయిల్ పై విడుదలైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ మధ్య దాదాపుగా రెండున్నర గంటలపాటు భేటీ జరిగింది. అనారోగ్య కారణాలతో బెయిల్ పై విడుదలైన చంద్రబాబును పరామర్శించేందుకు పవన్‌ కళ్యాణ్‌, జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. ప్రధానంగా ఆంధ్రాలో భవిష్యత్తు రాజకీయం, ఉమ్మడి మ్యానిఫెస్టో, క్షేత్రస్థాయి పోరాటాలు వంటి అంశాల పై ఇరుపక్షాలు […]

దళపతి విజయ్‌ రాజకీయ ఎంట్రీపై హింట్..!

దళపతి విజయ్‌కు కోలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి అస్సలు వివరించనక్కర్లేదు. విజయ్ సినిమా వచ్చిదంటే.. ప్రచారం బాధ్యతను వారే తీసుకుంటారు.. మూవీ మేకర్స్ కంటే ఎక్కువ పబ్లిసిటీ చేస్తుంటారు. అందుకే ప్లాప్‌ సినిమాలైనా అయినా సరే మినిమమ్ వసూళ్లతో బయటపడుతుంటాయి. అంతటి ఆదరణ ఉంది విజయ్ కు అభిమానుల్లో. విజయ్ కు కూడా ఫ్యాన్స్ అంటే చాలా ఇష్టం. తన సక్సెస్ సంతోషాన్ని ప్రతిసారి అభిమానులతో పంచుకుంటాడు. అయితే […]

మునుగోడులో రసవత్తరంగా త్రిముఖ పోటీ

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. త్రిముఖ పోటీ జరుగుతోంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో 2022లో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన రాజగోపాల్‌రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరి.. టికెట్‌ తెచ్చుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడిన చల్లమల కృష్ణారెడ్డి.. బీజేపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. అధికార బీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కూసుకుంట్ల […]

వరుస కేసులతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి

తెలుగుదేశం అధినేత చంద్రబాబు పై రాష్ట్ర ప్రభుత్వం వరుస కేసులు నమోదు చేస్తోంది. రెండురోజుల క్రితం మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయని కేసు నమోదు చేయగా, తాజాగా ఇసుక పాలసీలో అక్రమాలు జరిగాయని మరో కేసు నమోదు చేశారు. ఇలా వరుస కేసులతో చంద్రబాబుపై అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేస్తూ ఆయనను జైలు నుంచి బయటకు రాకుండా చేయాలని ప్రభుత్వం వ్యూహం రూపొందించింది. టీడీపీ అధినేత చంద్రబాబు ను అధికార […]

తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటీ…?

పోలింగ్ చివరి వారం కాంగ్రెస్ కి కలిసి రానుందా? ఆ ఏడు రోజులు కాంగ్రెస్ కీలక నేతలంతా తెలంగాణలో ఉండనున్నారా? ఆపరేషన్ తెలంగాణ పేరుతో సునీల్ కనుగోలు కొత్త అస్త్రాన్ని వదలనున్నరా? పరిస్థితి చూస్తుంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా అధిష్టానం కసరత్తు చేస్తోంది. తెలంగాణ రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండటంతో తామే గెలుస్తామనే కాన్ఫిడెన్స్ లో ఉన్నారు హస్తం నేతలు. మరో వైపు కాంగ్రెస్ […]

స్పీడ్ పెంచిన టీడీపీ-జనసేన…!

ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేసేందుకు టీడీపీ, జనసేన పార్టీలు మరింత స్పీడ్ పెంచుతున్నాయి. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమావేశాలు పూర్తి అయిన అనంతరం ఇరుపార్టీల సమన్వయంతో వెయ్యి మందితో విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు. ఏపీ వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారీగా టీడీపీ, జనసేన కలిసి సమన్వయ సమావేశాలు నిర్వహించేందుకు రంగం […]