కర్నూలులో టీడీపీకి భారీ షాక్ తగలబోతోంది. నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చేరికతో జిల్లాలో పార్టీ బలపడుతుందని ఊహించిన అధిష్ఠానానికి.. ఇప్పుడు అదే తలనొప్పిగా మారింది. బలపడాల్సిన చోట.. మరింత బలహీనంగా మారుతోంది. ఇప్పటికే పార్టీ సినియర్ నేత గంగుల ప్రభాకర్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకుని.. జగన్ చెంతకు చేరిపోయారు. ఇప్పుడు భూమా చేరికను తొలి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న శిల్పా వర్గం కూడా.. వైసీపీలో చేరిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం! జిల్లాలో ఇద్దరు […]
Category: Latest News
తమిళ అసెంబ్లీ సాక్షిగా ఓడిన ముగ్గురు
తమిళనాడు అసెంబ్లీలో సీఎం పళనిస్వామి బల పరీక్షలో నెగ్గుతారా ? లేదా ? అన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఈ రోజు జరిగిన బలపరీక్షలో పళనిస్వామి రాజకీయ చతురత ముందు మరోసారి పన్నీరు సెల్వం, డీఎంకే బొక్కబోర్లపడ్డాయి. తమిళ అసెంబ్లీలో కురుక్షేత్రాన్ని తలపించేలా జరిగిన అవిశ్వాస తీర్మానంలో సీఎం పళనిస్వామికి అనుకూలంగా 122 మంది ఎమ్మెల్యేలు ఓటువేశారు. వ్యతిరేకంగా 11 వ్యతిరేక ఓట్లుపడ్డాయి. ఇక ఈ బలపరీక్షలో పైకి పన్నీరు సెల్వం ఓడినట్లు కనిపిస్తున్నా ఓవరాల్గా మాత్రం […]
టీడీపీ ఎమ్మెల్సీ సీట్లు దక్కేది వీళ్ళకేనా!
ఆంధ్రప్రదేశ్లో శాసనమండలికి వెళ్లే పెద్దల జాబితా సిద్ధమైంది. తీవ్ర చర్చలు, సామాజిక వర్గాల బేరీజు, ఆశావహుల సీనియారిటీ వంటి అన్ని అంశాలను పరిశీలించి ఎట్టకేలకు తుది లిస్ట్ను తయారుచేసినట్టు తెలుస్తోంది. కొత్తగా వచ్చిన వారితో పాటు పార్టీలో ఎంతో కాలం నుంచి కొనసాగుతున్న సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్న విషయం తెలిసిందే! ఈ మేరకు అనేక తర్జనభర్జనల అనంతరం దీనిని రూపొందినట్లు తెలుస్తోంది. అయితే ఆరో అభ్యర్థిని కూడా గెలిపించుకునేందుకు సీఎం పక్కా […]
మూడేళ్లలో కేసీఆర్ చేసిన అప్పు తెలిస్తే షాకే..
విభజనతో 16వేల కోట్ల తీవ్ర లోటు బడ్జెట్తో ఏపీ తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఇప్పటికీ ఆ నష్టం కొనసాగుతూనే ఉంది. దీంతో అప్పు ఇచ్చే వారి కోసం ఏపీ ఎదురుచూస్తుంటే ఇప్పుడు తెలంగాణ పరిస్థితి కూడా ఇలానే మారిందట. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ.. బంగారు తెలంగాణ సాధన వైపు అడుగులేస్తోందని నాయకులు ఊదరగొడుతున్నారు. అయితే ఇదంతా కేవలం ఆ ప్రభుత్వం చేస్తున్న ప్రచారమేనట. ఇప్పుడు తెలంగాణ కూడా అప్పుల ఊబిలో కూరుకుపోతోందట. ఈ […]
బాబు మజాకా … దెబ్బకి రావెల విలవిల
ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు వ్యవహారం రోజురోజుకూ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తీసుకొస్తోంది. అటు పార్టీలోనూ, ఇటు ఆయన నియోజకవర్గంలోనూ ఆయనపై వ్యతిరేకత అధికమవుతోంది. కొద్ది గంటల పాటు.. సెక్యూరిటీని సైతం పక్కనపెట్టి వెళ్లడంతో రావెలపై పార్టీలో నిఘా పెరిగింది. అయితే ఇంత అవకాశమిచ్చినా రావెలలో మార్పు రాకపోవడంతో చంద్రబాబు తనయుడు లోకేష్ రంగంలోకి దిగారు. మంత్రి పోర్ట్ పోలియోకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఇక లోకేష్ కనుసన్నల్లోనే రావెల విధులు నిర్వర్తించేలా […]
ఆ ఇద్దరు మంత్రులు జగన్ గూటికి జంప్ … ఇదే నిదర్శనం
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పేరు చెబితే టీడీపీ నేతలు సర్రున ఒంటికాలిపై లేస్తారు. ఇక మంత్రుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు! కానీ ఏపీ కేబినెట్లోని ఇద్దరు మంత్రులు జగన్తో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారా? నిత్యం జగన్తో టచ్లో ఉంటూ.. ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తున్నారా? ఇక వారు రేపో మాపో టీడీపీని వీడి జగన్ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారా? అంటే అవుననే సమాచారమే వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం టీడీపీపై ప్రజల్లో క్రమక్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది. […]
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా లగడపాటి… నియోజకవర్గం కన్ఫార్మ్..!
ఆంధ్రా ఆక్టోపస్గా పేరొందిన కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేరు తెలియని వారుండరు! రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుకు తీవ్రంగా కలత చెందిన ఆయన.. కొద్ది కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కానీ ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో యాక్టివ్ కావాలని నిర్ణయించుకున్నారట. దీనికి సంబంధించి మరో సంచలన విషయమేంటంటే.. ఆయన వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష వైసీపీ తరఫున ఎమ్మెల్యే పోటీ చేయబోతున్నారట. ఇందుకు సంబంధించి నియోజకవర్గం కూడా దాదాపు ఖరారు అయిందని సమాచారం. ఈ […]
టీడీపీలో అన్నదమ్ముల మధ్య ఊహించని పరిణామం
ఏపీలో అధికార టీడీపీలో ఎమ్మెల్సీల కోసం అప్పుడే సెగలు రేగాయి. ఎవరికి వారు తమకు ఎమ్మెల్సీ కావాలంటే తమకు ఎమ్మెల్సీ కావాలని పోటీపడుతూ అధినేత చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు పోటీపడుతున్నారు. ఈ క్రమంలోనే అధికార టీడీపీలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఎమ్మెల్సీ చిచ్చు రేగినట్టు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఈ వార్త పెద్ద హాట్ టాపిక్గా మారింది. నెల్లూరు జిల్లాలో ఆనం బ్రదర్స్ ఎప్పుడూ హాట్ టాపిక్. ఎన్ని సమస్యలు ఉన్నా ఆనం బ్రదర్స్ […]
ఆ ఈక్వేషన్స్కు బలైన పన్నీరు సెల్వం
కొద్ది రోజుల క్రితం తమిళనాడులో చెలరేగిన జల్లికట్టు వివాదం కేంద్రం దిగి రావడంతో తెరపడింది. ఆ తర్వాత అక్కడ స్టార్ట్ అయిన పొలిటికల్ జల్లికట్టులో చివరి గెలుపు ఎడప్పాడి పళని స్వామి (ఈపీఎస్)ని వరిస్తే… ఓ.పన్నీరు సెల్వం (ఓపీఎస్) పరాజితుడు అవ్వాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు తమిళ జనాలందరూ పాపం ఓపీఎస్ అని అంటున్నారు. ఇక గతంలోనే రెండుసార్లు అమ్మ జయలలిత జైలుకు వెళ్లడంతో సీఎం అయిన పన్నీరు సీఎం అయ్యి కొద్ది కాలానికే తిరిగి అమ్మకోసం […]