ఏపీలో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు తారస్థాయిలోనే నడుస్తుంది. చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య సీట్ల కోసం పోటీ నెలకొంది. సీట్ల కోసం నేతల సిగపాట్లు పడుతున్నారు. ఇదే క్రమంలో రామచంద్రాపురం సీటులో రచ్చ నడుస్తుంది. అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్కు రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సెగలు తగులుతున్నాయి. నెక్స్ట్ ఎన్నికల్లో తన వారసుడు కోసం పిల్లి రామచంద్రాపురం సీటు ట్రై చేస్తున్నారు. ఇక తన వారసుడుతో అక్కడే పార్టీ […]
Author: Krishna
గోదావరి జిల్లాల్లో పవన్ దెబ్బ..ఆ ఒక్క మంత్రి సేఫ్.!
ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ ప్రభావం తారస్థాయిలో ఉందనే చెప్పాలి. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేనకు బలం ఎక్కువ. అలాగే గెలుపోటములని తారుమారు చేసే సత్తా ఆ పార్టీకి ఉంది. అయితే గత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేసి భారీగా ఓట్లు చీల్చి…టిడిపి ఓటమికి, వైసీపీ గెలుపుకు సహకరించింది. తూర్పులో 19 సీట్లు ఉంటే వైసీపీ 14, టిడిపి 4, జనసేన 1 సీటు గెలుచుకుంది. అప్పుడే టిడిపి-జనసేన కలిసి ఉంటే […]
ప్రకాశంలో లోకేష్..కందుకూరులో టీడీపీ నేతల పోటీ..సీటు ఎవరికి?
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోకి నారా లోకేష్ పాదయాత్ర అడుగుపెట్టింది. 15వ తేదీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నుంచి మొదలుపెట్టి..ప్రకాశంలోని కందుకూరులోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక కందుకూరులో లోకేష్కు టిడిపి నేతలు, శ్రేణులు భారీ స్వాగతం పలికారు. ఇక కందుకూరులో లోకేష్ ఎంట్రీ ఇవ్వగానే..అక్కడ ఉన్న టిడిపి నేతలు లోకేష్ తో మాట్లాడటానికి పోటీ పడ్డారు. మొదట టిడిపి ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు లోకేష్ వెంట నడిచారు. ఆ వెంటనే లోక్ […]
వాలంటీర్లపై లోకేష్ సంచలనం..టీడీపీ అధికారంలోకి వస్తే..!
ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్..వాలంటీర్ల టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో మహిళల డేటా టేసుకుని సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారని, రాష్ట్రంలో వందల మంది మహిళలు మిస్ అవ్వడానికి కారణం వాలంటీర్ల అని, అలాగే ప్రతి కుటుంబం డేటా టేసుకుని ఐప్యాక్కు ఇస్తున్నారని, ఈ డేటా మొత్తం హైదరాబాద్ లోని ఓ ఆఫీసులో ఉందని ఆరోపిస్తున్నారు. ఇక అటు వైసీపీ నేతలు, వాలంటీర్లు సైతం పవన్ పై విరుచుకుపడుతున్నారు. ఇదే […]
తిరుపతికి పవన్..సీఐ అంజుపై చర్యలు?
శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్ ఎక్కువ వివాదాల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. ఆమె అధికార వైసీపీకి అండగా ఉంటూ..ప్రతిపక్షాలు ఏమైనా నిరసనలు తెలియజేస్తే వారిని అణిచివేసే కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆ మధ్య నిరసన తెలియజేస్తున్న టిడిపి కార్యకర్త పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు విమర్శలు వచ్చాయి. అలాగే హోటల్ సమయానికి మూయలేదంటూ శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ ఓ మహిళపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ అయింది. ఇక తాజాగా […]
తణుకుపై జనసేన పట్టు..టీడీపీ వదులుకునే ఛాన్స్ లేదు.!
తణుకు నియోజకవర్గం టిడిపికి కంచుకోట అనే సంగతి తెలిసిందే. ఇక్కడ టిడిపి మంచి విజయాలే సాధించింది. 1983 టూ 1999 వరకు వరుసగా అయిదుసార్లు గెలిచింది. 2004, 2009లో ఓడిపోగా, 2014లో మళ్ళీ గెలిచింది. 2019 లో మళ్ళీ ఓడిపోయింది. 2019లో చాలా స్వల్ప మెజారిటీ తేడాతో టిడిపి ఓడింది. వైసీపీ నుంచి కారుమూరి నాగేశ్వరరావు పోటీ చేయగా, టిడిపి నుంచి అరిమిల్లి రాధాకృష్ణ పోటీ చేశారు. కేవలం 2 వేల ఓట్ల తేడాతో కారుమూరి గెలిచారు. […]
తిరువూరు తమ్ముళ్ళకు బాబు క్లాస్..ఈ సారైనా గట్టెక్కుతారా?
అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లుగానే తిరువూరులో టిడిపి పరిస్తితి ఉంది. బలమైన నాయకులు ఉన్నారు..కేడర్ ఉంది..అయినా సరే టిడిపి గెలిచి 20 ఏళ్ళు అయిపోయింది. అంటే నాయకులు ఉన్నా సరే వారి మధ్య సమన్వయం లేదు. ఎప్పటికప్పుడు ఆధిపత్య పోరు ఉంటుంది..అందుకే ఇక్కడ టిడిపి గెలవడం కష్టమవుతుంది. 1999 వరకు ఇక్కడ టిడిపి మంచి విజయాలే సాధించింది. ఆ తర్వాత నుంచి టిడిపికి ఏది కలిసిరావడం లేదు. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో […]
కారు-కాంగ్రెస్ మధ్యే పోరు…కమలం సింగిల్ డిజిట్తోనే.!
ఈ సారి కూడా తెలంగాణలో బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యే పోరు నడవనుంది. అందులో ఎలాంటి డౌట్ లేదని తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. గత రెండు ఎన్నికల్లో అదే మాదిరిగా పోరు జరిగింది. కాకపోతే కారుకు..కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో బిఆర్ఎస్ పార్టీ వన్సైడ్గా గెలిచింది. కానీ ఈ సారి ఎన్నికలు అలా ఉండవని కారుకు కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వనుందని తేలింది. అయితే మొన్నటివరకు రేసులో కనిపించిన బిజేపి మాత్రం..ఇప్పుడు పూర్తిగా వెనుకబడిపోయింది. […]
రోజుకో ట్విస్ట్..వాలంటీర్లే టార్గెట్..పవన్కు ప్లస్ అదే.!
జనసేన అధినేత పవన్ కల్యాణ్…వాలంటీర్ల విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. వైసీపీ నేతలు బూతులు తిట్టిన, వాలంటీర్లు దిష్టి బొమ్మలు తగలబెట్టిన..పవన్ మాత్రం తాను చేసే విమర్శల పదును ఏ మాత్రం తగ్గించడం లేదు. వాలంటీర్లని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. అలాగే రోజుకో కొత్త అంశంపై వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. తాజాగా తణుకులో వారాహి యాత్ర నిర్వహించిన పవన్…జగన్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 219 దేవాలయాలపై దాడులు జరిగాయని, […]