నందమూరి నటసింహం బాలకృష్ణ.. తన 50 ఏళ్ల సినీ కెరీర్లో ఎంతో మంది స్టార్ హీరోయిన్లతో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఎన్నో బ్లాక్బస్టర్ హీట్లను తన ఖాతాలో వేసుకున్న బాలయ్య.. ఇప్పటికి సీనియర్ స్టార్ హీరోగా తిరుగులేని క్రేజ్తో వరుస సక్సెస్లు అందుకొంటూ దూసుకుపోతున్నాడు. ఇలాంటి క్రమంలోనే బాలయ్యకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ గా మారుతుంది. బాలయ్యతో కలిసి గతంలో పదుల సంఖ్యలో సినిమాలతో స్క్రీన్ పై రొమాన్స్ చేసిన స్టార్ హీరోయిన్.. అదే ఇంటికి కోడలుగా మారింది అంటూ న్యూస్ తెగ ట్రెండ్ అవుతుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
బాలయ్యతో ఎక్కువగా సినిమాలు నటించి ఆయనకే బంధువుగా మారిన ఆ ముద్దుగుమ్మ మరెవరు కాదు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. ఎస్.. మీర విన్నది కరెక్టే. గతంలో బాలయ్య, విజయశాంతి జంటగా ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇద్దరు కలిసి నటించిన సినిమాల్లో ఇండస్ట్రియల్ హిట్లు సైతం ఉన్నాయి. కాగా.. విజయశాంతి 1988లో ఎం.వి. శ్రీనివాస్ ప్రసాద్ను వివాహం చేసుకుంది. శ్రీనివాస్ ప్రసాద్.. బాలకృష్ణకు బంధువే అని చాలామందికి తెలియదు. బాలయ్య పెద్ద బావ గణేష్ రావుకు.. శ్రీనివాస్ ప్రసాద్ స్వయాన మేనల్లుడు. ఈ క్రమంలోనే బాలయ్య, ప్రసాద్ల మధ్య ఉన్న సాన్నిహిత్యంతో.. యువరాత్మ ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీనివాస్ ప్రసాద్.. నిప్పురవ్వ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.
ఇక ఈ సినిమాలో బాలయ్య హీరోగా నటించగా.. హీరోయిన్గా విజయశాంతి తీసుకోవాలని భావించిన ప్రసాద్.. స్వయంగా ఆమెను అప్రోచ్ అయి తనతో గ్రీన్ సిగ్నల్ ఇప్పించారు. ఈ క్రమంలోనే శ్రీనివాస్ ప్రసాద్, విజయశాంతిల మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అలా బాలకృష్ణకు దగ్గర బంధువైన శ్రీనివాస్ ప్రసాద్ను వివాహం చేసుకుని.. విజయశాంతి వరుసకు బాలయ్య కోడలుగా మారింది. ఇక విజయశాంతి ఇటీవల రీ ఎంట్రీతో పలు సినిమాలు నటిస్తున్న సంగతి తెలిసిందే. అలా మహేష్ బాబుతో సరిలేరు నీకెవరు సినిమాలో నటించిన ఈ అమ్మడు.. తాజాగా కళ్యాణ్ రామ్ తల్లిగా అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలోను మెరిసింది.