మ్యాజికల్ డైరెక్టర్ శేకర్ కముల తాజాగా తెరకెక్కించిన మూవీ కుబేర. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా.. నాగార్జున కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా మెరిసింది. ఈ సినిమా రిలీజ్కు ముందే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్, టీజర్, గ్లింప్స్, ట్రైలర్లతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్న మేకర్స్ ఈ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశారు. ఇలా భారీ అంచనాల నడుమ శుక్రవారం జూన్ 20న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన కుబేర.. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది.
ఈ క్రమంలోనే శేఖర్ కమ్ముల టేకింగ్పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. ధనుష్, నాగార్జున, రష్మిక నటనపై కూడా పాజిటివ్ కామెంట్లు చేస్తూ తెగ పొగిడేస్తున్నారు. అయితే.. ఇంత పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న కుబేర సినిమాను.. మొదట ఓ టాలీవుడ్ స్టార్ హీరో మిస్ చేసుకున్నాడు అంటూ ఓ న్యూస్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. కుబెరలో ధనుష్ బిచ్చగాడు పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే.. మొదట ఈ పాత్ర కోసం టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండను భావించారట శేఖర్ కమ్ముల. విజెయ్తో ఉన్న పరిచయంతో ఈ సినిమాకు విజయ్కు చాన్స్ ఇవ్వాలని భావించాడట.
అయితే.. ఎందుకో విజయ్ దీనిపై పెద్దగా ఆసక్తి చూపలేదని.. దీంతో శేఖర్ కమ్మల.. ధనుష్ను అప్రోచ్ అయినట్లు తెలుస్తుంది. అతను వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినిమా సెట్స్పైకి వచ్చింది. ఇక ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియదు గాని.. నిజంగానే విజయ్ దేవరకొండ ఈ సినిమా చేసుంటే మాత్రం కచ్చితంగా ఆయన కెరీర్లో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చి ఉండేదని నెటిజన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.