ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్టులో ఆ స్టార్ హీరో.. మాస్ జాతరకు మైండ్ బ్లాక్..!

పాన్ ఇండియ‌న్‌ స్టార్ట్ డైరెక్టర్‌గా ప్రశాంత్ నీల్‌.. ఎలాంటి క్రేజ్, పాపులారిటీతో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదట కన్నడలో ఉగ్రం సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన ప్రశాంత్‌.. ఈ సినిమాతో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను పాన్ ఇండియా లెవెల్లో రూపొందించాడు. కన్నడ యాక్టర్ య‌ష్ హీరోగా.. కేజిఎఫ్ చాప్టర్ 1 సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడమే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లో ప్రశాంత్ నీల్‌కు తిరుగులేని పాపులారిటీని తెచ్చిపెట్టింది. తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 2తో మరోసారి గ్రాండ్ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు.

Has Jr NTR's movie with Prashanth Neel gone on floors? Know the truth

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో చివరిగా తెర‌కెక్కించిన సలార్ పార్ట్ 1 సైతం మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. పాన్ ఇండియా లెవెల్‌లో తిరుగులేని పాపులారిటీతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మరో సినిమాను రూపొందిస్తూ బిజీగా గడుపుతున్నాడు. దీనిపై కూడా ప్రేక్షకుల్లా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి క్రమంలో ప్రశాంత్ నీల్‌ డ్రీం ప్రాజెక్టుగా రావ‌ణం మూవీ తెర‌కెక్క‌నుందంటూ టాక్ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే.

Prashanth Neel meets Allu Arjun in Hyderabad; internet raves over a  potential collaboration | Kannada Movie News - The Times of India

దీనిపై.. నిన్న మొన్నటి వరకు క్లారిటీ లేకున్నా.. ఇప్పుడు ఈ సినిమాలో హీరోగా నటించేది ఆ స్టార్ హీరోనే అంటూ.. ఓ కొత్త న్యూస్ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. ప్రశాంత్ నీల్ రావణం సినిమాలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టించ‌నున్నాడ‌ట‌. నిజంగానే ప్రశాంత్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రావణం తెర‌కెక్కి.. అందులో బ‌న్నీ హీరోగా నటిస్తే మాత్రం.. ఆడియన్స్‌కు సినిమాపై పిక్స్ లెవెల్‌లో హైప్ నెలకొంటుంది అనడంలో సందేహం లేదు. ఇక ప్రస్తుతం బన్నీ.. అట్లీ డైరెక్షన్లో ఓ బడ ప్రాజెక్టులో నటిస్తున్నాడు.