ఆ డైరెక్ట‌ర్‌తో రాజమౌళికి వార్‌.. ఆ బయోపిక్ హక్కులు ఎవరికో..?

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఎస్. ఎస్. ఎం. బి 29 షూట్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో విపరీతమైన క్రేజ్, పాపులారిటీ దక్కించుకున్న రాజమౌళి.. ఈ క్రమంలోనే ఓ ప్రముఖుడి బయోపిక్ తెర‌కెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఆ బయోపిక్ సంబంధించిన హక్కుల విష‌యంలో మరో డైరెక్టర్ తో ఆయనకు పోలీ మొదలైందట‌. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు.. ఆ బయోపిక్ ఏవ‌రిది.. ఆ రైట్స్ ఎవరికి దక్కాయి.. ఒకసారి తెలుసుకుందాం. రాజమౌళితో పాటు బాలీవుడ్.. దర్శక దాగ్గ‌జం రాజకుమార్ హీరోణి కూడా ఒకే ప్రముకుడి జీవిత కాలత సినిమా తీయాలని భావిస్తున్నారు. కానీ.. ఆ ఇద్దరు వేరువేరు ప్రకటనలతో ఇప్పటికే ఆ సినిమా బయోపిక్ తెర‌కెక్కించనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఇద్దరు మధ్యన గట్టి పోటీ మొదలైంది.

రాజమౌళి తన బయోపిక్ సినిమాకు పాత్రధారుడిగా ఎన్టీఆర్‌ను అనౌన్స్ చేయగా.. హీరాణి తన సినిమాలో టైటిల్ రోల్‌ను అమీర్ ఖాన్‌ పోషిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇంతకీ వీళ్లిద్దరూ తీయాలి అనుకుంటున్న బయోపిక్ ఎవరిదో కాదు.. దాదాసాహెబ్ ఫాల్కేది కావడం విశేషం. ఇలాంటి క్రమంలోనే ఇద్దరు తీయాల‌నుకుంటున ఈ బయోపిక్ ఒరిజినల్ రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి అనే సస్పెన్స్ అందరిలోనూ మొదలైంది. రెండు వారాల క్రితం రాజమౌళి బృందం తారక్‌ను ప్రధాన పాత్రలో దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌ను.. మేడిన్ ఇండియా టైటిల్ తో ప్రకటించారు. రాజమౌళి వారసుడు కార్తికేయ ఈసినిమాకు ప్రొడ్యూసర్గా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. ఇంతలోనే రాజ్ కుమార్ హీరాణి నుంచి మరింత క్లారిటీ వచ్చింది. అమీర్ ఖాన్ నెక్స్ట్ స్పోర్ట్స్ కామెడీ డ్రామా.. సితారే జమీన్ పర్ రిలీజ్ తర్వాత.. దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ పై పని చేయనున్నాడట.

Aamir Khan, Rajkumar Hirani reunite for Dadasaheb Phalke biopic, filming to  begin in October | Mint

ఈ సినిమాకు రాజకుమార్ హీరణి దర్శకత్వం వహిస్తున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిబట్టి లెజెండ్ ఫాల్కే పై ఇద్దరూ దిగ్గజ దర్శకుల మధ్య పోటీ నెలకొన్ననుందట. అంతే కాదు.. వీళ్ళు తమ ప్రాజెక్టులలో ఎన్టీఆర్, అమీర్ ఖాన్ లాంటి ఇద్దరు టాప్ స్టార్ హీరోలను నటింప చేయడం ఆడియన్స్‌లో మరింత ఉత్కంఠ రేకెత్తిస్తుంది. అయితే.. ఇద్దరూ ఒకే తరహాలో కథను రెండు బయోపిక్‌లుగా రూపొందిస్తే మాత్రం.. సిల్వర్ స్క్రీన్‌పై ఆడియన్స్‌కు కన్ఫ్యూషన్ తప్పదు. అయితే.. రాజమౌళి, హిరాణి ఇద్దరు అండర్స్టాండింగ్‌తో ఒక్కొక్కరు.. ఒక్కో కోణంలో ఫాల్కేను తెరపై ఆవిష్కరించాలని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఫాల్కే జీవిత గాధ హక్కులు ఎవరి దగ్గర ఉన్నాయ్.. అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.