టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు.. డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప త్వరలోనే ఆడియన్స్ను పలకరించనున్న సంగతి తెలిసిందే. తాజాగా.. సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా.. జూన్ 27న గ్రాండ్ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. విష్ణు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమాలో.. తానే ప్రధాన పాత్రలో మెరవనున్నాడు. ఈ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, మలయాళం యాక్టర్ మోహన్ లాల్, టాలీవుడ్ నటులు మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్ కాస్టింగ్ అంతా కీలక పాత్రలో నటించారు.ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్ లో హైప్ క్రియేట్ చేయడానికి తెగ కష్టపడుతున్నారు మూవీ టీం.
ఇక సినిమాను పలు ఈవెంట్లతో ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు ఏ సినిమాలో కన్నప్ప గురించి తెలియని కొత్త విషయాన్ని ఈ సినిమాలో చూడబోతున్నారంటూ విష్ణు, మోహన్ బాబు.. ఇప్పటికే పలు ప్రమోషన్స్ లో వెల్లడించిన సంగతి తెలిసిందే. అలా సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొల్పిన టీం..దానికి తగ్గట్టుగానే అన్ని ఏరియాలో థియేట్రికల్ హక్కులు భారీ ధరకు బిజినెస్ చేసినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా.. తాజాగా ఈ మూవీ యూనిటీ సినిమాకు సంబంధించిన సీడెడ్ ఏరియా థియేటర్ హక్కులను.. టాలీవుడ్ భారీ ప్రొడక్షన్ బ్యానర్కు అమ్మేసినట్లు తెలుస్తుంది.ఈ మూవీ సీడెడ్ హక్కులను టాలీవుడ్ ఇండస్ట్రీలోనే తిరుగులేని ఇమేజ్తో దూసుకుపోతున్న.. బిగ్ బడా నిర్మాణ సంస్థ ఆయన మైత్రి మూవీ మేకర్స్ దక్కించుకున్నారట.
ఈ క్రమంలోనే మైత్రి మేకర్స్ లాంటి బడా సంస్థ కన్నప్ప హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసింది అంటే కచ్చితంగా సినిమా లో మంచి కంటెంట్ ఉండి ఉంటుందని నమ్మకం ఆడియన్స్ లో మరింతగా పెరిగింది. ఇక మైత్రి మేకర్స్ చేతికి కన్నప్ప హక్కులు వెళ్లాయి అంటే.. సిడెడ్ ఏరియాలో భారీ ఎత్తున థియేటర్లలో కన్నప్ప రిలీజ్ కావడం ఖాయం. ఈ సినిమాకు మంచి టాక్ వస్తే మాత్రం ఇక సీడెడ్ ఏరియాలో కన్నప్ప కు కనక వర్షం కురవడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి .మరో మూడు రోజుల్లో రిలీజ్ కానున్న ఈ మూవీ.. ఆడియన్స్ లో ఎలాంటి టాక్ను తెచ్చుకుంటుందో.. సిడెడ్ ఏరియాలో ఏ రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొడుతుందో చూడాలి.