టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, ధనుష్ కాంబోలో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన తాజా మూవీ కుబేర. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు అన్నింటిని ముగించుకుని.. ఆడియన్స్ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. ఈనెల 24న గ్రాండ్ లెవెల్లో సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్.. ఆడియన్స్లో మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. ఇందులో రష్మిక మందన హీరోయిన్గా మెరువనుంది. ఇక సెన్సిటివ్ అంశాలను బేస్ చేసుకుని సినిమాలను తెరకెక్కించడం శేఖర్ కమ్ముల స్పెషాలిటీ. ఈ సినిమా కూడా అదే మేనర్లో కొనసాగనుందని.. తాజాగా టీజర్తో క్లారిటీ వచ్చింది. ఇక లవ్ స్టోరీ సినిమా తర్వాత.. లాంగ్ గ్యాప్ తో శేఖర్ కమ్ముల ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.
తన మనసుకు నచ్చినట్లు.. కథ ఆడియన్స్ను మెప్పించేలా తీర్చిదిద్దాడట. ఇక ఈ సినిమాకు సంబంధించిన మొదటి కాపీ ఇప్పటికే సెన్సార్ సభ్యులు వీక్షించారని.. రేపు సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. కాగా.. సెన్సార్కు పంపేముందు మొదటి కాపీకి సంబంధించిన స్పెషల్ రివ్యూ ప్రసాద్ ల్యాబ్స్లో మూవీ టీం.. కొంతమంది ప్రముఖులతో కలిసి వీక్షించారట. రివ్యూ షో నుంచి వచ్చిన టాక్ నెటింట వైరల్గా మారుతుంది. శేఖర్ కమ్ముల మరోసారి ఈ సినిమాతో తన సత్తా చాటుకున్నాడట. మొదటి నుంచి గ్రిపింగ్ స్క్రీన్ ప్లేతో, అద్భుతమైన టేకింగ్ తో ఆడియన్స్ను మెప్పించేలా ప్రతి సన్నివేశాన్ని డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. నాగార్జున చాలా కాలం గ్యాప్ తర్వాత నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్లో అదరగొట్టాడని.. ధనుష్ యాక్టింగ్ వేరే లెవెల్ అని టాక్ వినిపిస్తుంది.
ఇక సినిమా క్లైమాక్స్ చివర 15 నిమిషాలు నాగార్జున, ధనుష్ మధ్యన వచ్చే సీన్స్, కాన్వర్జేషన్ సినిమాలు వేరే లెవెల్కు తీసుకు వెళ్ళిందని చెప్తున్నారు. ఓవరాల్గా సినిమా ఎమోషనల్ రోలర్ కోస్టర్లో ఉండనుందట. అంతేకాదు.. సినిమా శేఖర్ కమ్ముల కెరీర్లోనే ది బెస్ట్ మూవీగా నిలవనుందని టాక్. ఇక ఈ ఏడాది అక్కినేని ఫ్యామిలీకి బాగా వర్కౌట్ అవుతుంది. ఫిబ్రవరి నెలలో నాగార్జున తనయుడు అక్కినేని నాగచైతన్య.. తండేల్తో హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సక్సెస్ ట్రీట్ ని తండ్రి నాగార్జున కొనసాగించనున్నాడు అంటూ టాక్ నడుస్తుంది. ఇక ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో.. ఆడియోస్ను ఏ రేంజ్లో ఆకట్టుకుంటుందో తెలియాలంటే.. మరో 20 రోజులు వేచి చూడాల్సిందే.