టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. ప్రస్తుతం మహేష్ బాబు సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న జక్కన్న.. ఈ సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్ను టార్గెట్ చేశాడు. ఈ క్రమంలోనే కేవలం పాన్ ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ అంతా జక్కన, మహేష్ కాంబోలో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి29 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్రమంలో అసలు ఎవరు గెస్ చేయని ఒక క్రేజీ రికార్డును క్రాక్ చేసి వార్తల్లో నిలిచాడు.
ఒక జపనీస్ వీడియో గేమ్లో కనిపించి ఇండియన్ సెలబ్రిటీస్ ఎవ్వరికీ సాధ్యం కానీ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకీ ఆ గేమ్ ఏంటి.. అసలు మేటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఆర్ఆర్ఆర్ సినిమాను గ్లోబల్ వైడ్గా ప్రమోట్ చేసిన జక్కన్న.. ఆస్కార్ కూడా దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను జపాన్లో రిలీజ్ చేయగా.. అక్కడ కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే జపనీస్ వీడియో గేమ్స్ సృష్టికర్త అయిన హిడియో కోజిమాని రాజమౌళిని కలవడం నెటింట హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే.
మహేష్ సినిమా కోసం ఆయనతో కలిసి పనిచేయబోతున్నాడని టాక్ అప్పట్లో తెగ వైరల్ గా మారింది. కానీ.. అసలు మేటర్ అది కాదని ఇప్పుడు క్లారిటీ వచ్చింది. కొజిమో సృష్టించిన డెత్ స్టాండింగ్ 2.. వీడియో గేమ్ లో రాజమౌళితో పాటు.. ఆయన కొడుకు కార్తికేయ కూడా కనిపించడం హైలైట్ గా మారింది. ఇది చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. కారణం ఇప్పటివరకు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లను పాన్ ఇండియా స్టార్లుగా నిలబెట్టిన రాజమౌళి ఇప్పుడు ఇంటర్నేషనల్ వీడియో గేమ్లో కనిపించి.. తానే ఓ పాన్ వరల్డ్ స్టార్ గా మారిపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వీడియో గేమ్లో కనిపించిన ఇండియన్ ఫస్ట్ సెలెబ్రిటీగా జక్కన్న రికార్డును క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటింట తెగ వైరల్గా మారుతుంది.