టాలీవుడ్ పవర్ స్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు సినిమా కోసం పవన్ అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఏళ్ల తరబడి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. ఇప్పటికీ ఎన్నోసార్లు వాయిదా పడుతూ.. జూన్ 12న రిలీజ్ కు సిద్ధమైంది. అయితే తాజాగా మరోసారి ఈ సినిమా వాయిదా పడినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ఇలాంటి నేపథ్యంలో సినిమా విషయంలో పవన్ తీసుకున్న డెసిషన్ అందరికీ షాక్ ను కలిగిస్తుంది. సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఏ.ఏం. రత్నం ఈ సినిమా ఇప్పటికే చాలా ఆశలు పెట్టుకున్నారు.
సినిమా షూటింగ్ కోసం ఆయన అనుకున్న దానికంటే భారీ మొత్తని కర్చు చేసాడు. సినిమా వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో భారీ నష్టాలను చెవిచూసినట్లు తెలుస్తుంది. ఇక సినిమా అంతకంతకు ఆలస్యం అవుతున్న క్రమంలో డైరెక్టర్ క్రిష్ కూడా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే దీంతో నిర్మాత ఏ.ఏం. రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకుడిగా మారాడు. ఇలాంటి నేపద్యంలో పవన్ కీలక నిర్ణయం తీసుకున్నడట. తను ఈ సినిమా కోసం అడ్వాన్స్గా తీసుకున్న మొత్తం రూ.11 కోట్లను మళ్లీ వెనక్కి తిరిగి ఇచ్చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా ఇప్పటికే డజన్కు పైగా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు జూన్ 12న సినిమా రిలీజ్ అవుతుంది.. జూన్ 8న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంటుందని మేకర్స్ ప్రకటించడంతో.. పవన్ అభిమానులు ఎంతగానో ఆనందపడ్డారు. కానీ.. ఈ రెండు వాయిదా పడడంతో వల్ల ఆనందం అంత ఆవిరిపోయింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లేనట్టే అంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.