టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగాహరిహర వీరమల్లు షూట్ పూర్తి చేసి.. సిల్వర్ స్క్రీన్ పై మెరిసేందుకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. జులై 12న ఈ సినిమా రిలీజ్కావల్సింది. అయితే.. తాజాగా సినిమా వాయిదా పడి జూన్ నెలలోక మరో మంచి రోజున రిలీజ్కు టీం ప్లాన్ చేస్తున్నారంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఇందులో వాస్తవంతో తెలియదు కానీ.. అభిమానుల్లో మాత్రమే సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఇక పవన్ ఈ షూట్ పూర్తి చేసిన వెంటనే.. ఓజి సెట్స్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సినిమా షూట్ 70% పూర్తయిన నేపథ్యంలో.. వీలైనంనంత త్వరగా మిగతా భాగం కూడా పూర్తిచేసి.. పెట్టుకున్న టార్గెట్కు పనులు పూర్తి చేయాలని చూస్తున్నారు. సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. సుజిత్ ముంబైలో కీలక ఎపిసోడ్లను రూపొందించారు. ఓజి లో విలన్ గా నటిస్తున్న ఇమ్రాన్ హష్మీ ఇటీవల డెంగ్యూ బారిన పడడంతో షెడ్యూల్లో మార్పులు జరిగాయి.
ఈ క్రమంలోనే.. పవన్, ఇమ్రాన్ హష్మి కాంబినేషన్ సీన్స్ ను పోస్ట్పోన్ చేసి మిగతా సన్నివేశాలను పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. హష్మి కాంబినేషన్స్ దాదాపు పూర్తి కావడంతో.. షూట్ వేగంగా పుంజుకుంది. ఇక నేటి నుంచి పది రోజుల పాటు వరుసగా విజయవాడలో షెడ్యూల్లో ప్లాన్ చేసుకున్నారు. పవన్ పాత్రకు సంబంధించిన షూట్ ఆల్మోస్ట్ పూర్తి చేయాలని చూస్తున్నారు. థాయిలాండ్ లో రెండు రోజుల షూటింగ్ మిగిలి ఉన్నా.. అది మాత్రం వాయిదా పడే అవకాశం ఉందట. జూన్ నెలాఖరు నుంచి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పవన్ పాత్రకు డి ఏజ్నింగ్ టెక్నాలజీ ఉపయోగించాల్సిన క్రమంలో.. టీం దానిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. ప్రియాంక అరుళ్ మొహన్తో ఉండాల్సిన సాంగ్ ను కథకు అవసరం లేదని.. భావించి తొలగించినట్లు తెలుస్తుంది.
ఇక సినిమాలో పవన్ చాలా ట్రెండీ లుక్ లో మెరువనున్నాడని.. అసలు ఆడియన్స్ ఊహకు అందని రేంజ్లో ఆయన రోల్ డిజైన్ చేశాడంటూ తెలుస్తుంది. అంతే కాదు.. ఈ సినిమాకు అవార్డు విన్నర్ థమన్ మీద డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 25న అఖండ 2 రిలీజ్ కానుంది. ఇలాంటి క్రమంలోనే ఓజి రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ చేయడంతో.. ప్రస్తుతం ఓజి వర్సెస్ అఖండ 2 కోల్డ్ వార్ మొదలైంది అంటూ టాక్ వైరల్ గా మారుతుంది. సెప్టెంబర్ 25న రిలీజ్ డేట్ మారదని.. పవన్ సూచనల మేరకు వీరమల్లు రిలీజ్ అయిన వెంటనే ఓజి ప్రమోషన్స్ ప్రారంభించాలని డి.వి.వి. దానయ్య ఫిక్స్ అయ్యారట. ఇలాంటి క్రమంలోనే బాలయ్య అఖండ 2 పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ టాక్ నడిచింది. కానీ.. బాలయ్య మాత్రం పవన్ సినిమా వస్తే నేనెందుకు తప్పుకోవాలి అని ఫైర్ అయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే బాలయ్య ఆఖండ2 కూడా సెప్టెంబర్ 25న రావడం ఖాయమని.. ఈ రెండు సినిమాల మధ్య గ్రాండ్ బాక్స్ ఆఫీస్ వార్ తప్పదని టాక్ నడుస్తుంది. మరీ ఈ రేస్ లో ఎవరు విన్ అవుతారో వేచి చూడాలి.