నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తా.. నీ మ్యాడ్ నెస్ కోసం ఎదురుచూస్తున్న.. ప్రభాస్ ఇంట్రెస్ట్ పోస్ట్..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుని వరుస అవకాశాలను దక్కించుకున్న ప్రభాస్.. తర్వాత వర్షం, ఛ‌త్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ ఇలా తను నటించిన ప్రతి సినిమాతోనూ తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక క్రేజ్, పాపులారిటీని దక్కించుకున్నాడు. ఇంకా పాన్ ఇండియన్ స్టార్ హీరోగా మారిన తర్వాత.. పలు సినిమాలతో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా.. కలెక్షన్ల పరంగా మాత్రం తన సత్తా చాటుకుంటున్నాడు.

ఇక తన కెరీర్‌లో రాజమౌళి, ప్రశాంత్ నీల్‌, నాగ్ అశ్విన్‌లు ఇచ్చిన స‌క్స‌స్ చాలా స్పెష‌ల్ అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. ఈ ద‌ర్శకులంతా బహుబలి, సలార్‌, కల్కి 2898 ఏడి సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్లు ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చి పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో యావత్ ఇండియన్ ఇండస్ట్రీని ఆకట్టుకుంటున్న ప్రభాస్.. సోషల్ మీడియాలో మాత్రం పెద్దగా యాక్టివ్ గా ఉండ‌డన్న సంగతి తెలిసిందే.

ఇక ఎంతో కీలకమైన విషయాలను మాత్రమే అభిమానులతో పంచుకునే ప్రభాస్.. తాజాగా సల్లర్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేసిన స్పెష‌ల్ బ‌ర్డ్ విషేస్ అంద‌రిన‌పి ఆక‌ట్టుకుంది. నా సలార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. పార్ట్ 2లో నీ మ్యాడ్ నెస్‌ చూసేందుకు ఎదురుచూస్తున్న.. నిన్ను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటా అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో వెల్లడించారు. ప్రస్తుతం ప్రభాస్ పోస్ట్ నెటింట వైరల్‌గా మారుతుంది.