అంతఃపురం సౌందర్య కొడుకు గుర్తున్నాడా.. ఆ బుడ్డోడు ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో..!

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందించిన ఎన్నో అద్భుతమైన సినిమాలలో అంతఃపురం మూవీ కూడా ఒకటి. ప్రకాష్ రాజ్, సౌందర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా.. అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక ఈ సినిమాలో సౌందర్య నటనకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డుతో గౌరవించింది. జగపతిబాబుకి ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు దక్కింది. ఇక ప్రకాష్ రాజ్ ఈ సినిమాకు స్పెషల్ మెన్షన్ క్యాటగిరిలో నేషనల్ ఫిలిం అవార్డును సైతం సొంతం చేసుకున్నారు. అంతేకాదు కృష్ణవంశీకి బెస్ట్ డైరెక్టర్ గా. సౌందర్యకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డులు కూడా ద‌క్కాయి.

ఇక ఇళయరాజా సంగీత దర్శకుడుగా వ్యవహరించిన ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గాను నిలిచింది. ఇలా వ‌రుస అవార్డులు క్యూ క‌ట్టిన క్ర‌మంలో ఈ మూవీని బాలీవుడ్ లోను రీమేక్ చేశారు. 2003లో షారుక్ ఖాన్, కరిష్మా క‌పూర్ కాంబోలో తెర‌కెక్కిన ఈ మూవీ అక్క‌డ శ‌క్తి టైటిల్‌తో రిలీజై.. మంచి సక్సెస్ అందుకుంది. ఇక అంతఃపురం సినిమా తెలుగు వ‌ర్ష‌న్‌లో సౌందర్య కొడుకుగా నటించిన చిన్నోడు అందరికీ గుర్తుండే ఉంటాడు. ఈ బుడ్డోడు కోసమే కథ‌ అంతా నడుస్తుంది. ఇంతకీ ఆ పాత్రలో నటించిన బుడోడి పేరు కృష్ణ ప్రదీప్.

కేవలం రెండేళ్ల వయసులో తన నటనతో ఆకట్టుకున్న ఈ బుడ్డోడు.. అంత చిన్న వయసులోనే సినిమాలో సౌందర్య స్పృహ కోల్పోయిన సమయంలో.. కర్చిఫ్‌ నీటిలో తడిపి.. తుడిచే సీన్‌లో తన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే తర్వాత కృష్ణ ప్రదీప్ మరే సినిమాలో నటించింది లేదు. చదువుపై కాన్సెంట్రేట్ చేసి పై చదువులు పూర్తి చేసిన కృష్ణ ప్రదీప్.. ఇప్పుడు హీరో లుక్‌లో అదరగొడుతున్నాడు. హీరోలకు ధీటుగా మంచి ఫిజిక్‌తో మెప్పిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ది ఇండియన్ హౌస్ సినిమాతో ఆడియన్స్ పలకరించేందుకు సిద్ధమవుతున్న ఈ యంగ్ హీరో.. ఈ సినిమాతో ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటాడో వేచి చూడాలి.