కుబేర ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర సూపర్ టాక్తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లవ్ స్టోరీ లాంటి ఫీల్ గుడ్ సినిమాలతో మ్యాజిక్ చేసిన శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కి సంచలనం సృష్టిస్తుంది. కోలీవుడ్ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రధాన పాత్రలో మెరసిన ఈ సినిమా జూన్ 20న గ్రాండ్గా రిలీజ్ అయింది. మొదటి రోజు మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను దక్కించుకొని ఊహించని క్రేజ్తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాకు మెయిన్ హైలెట్ డీఎస్పీ మ్యూజిక్ మరింత ప్లస్ అయింది. సాంగ్స్తో పాటు.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడు డిఎస్పి.
ఇక బిచ్చగాడు రోల్లో ధనుష్ నట విశ్వరూపాన్ని చూపించాడు. మంచి, చెడుల మధ్య సతమతమయ్య సిబిఐ ఆఫీసర్గా నాగార్జున అద్భుతంగా మెప్పించాడు. ఇక.. ఈ సినిమాలో ధనుష్ నాగార్జునతో పాటు.. విలన్ రోల్లో నటించిన జిమ్స్ శర్బ్ కూడా హైలెట్గా నిలిచారు. ఈ క్రమంలోనే ఈ జిమ్స్ షర్బ్ ఎవరు.. అతని బ్యాగ్రౌండ్ ఏంటి అనే సెర్చింగ్ మొదలెట్టేసారు నేటిజన్స్. కాగా.. జేమ్స్ ముంబై కి చెందిన వ్యక్తి. ప్రస్తుతం 37 సంవత్సరాల వయసున్న జెమ్స్.. తండ్రి ఉద్యోగ రీత్యా చిన్నప్పటి నుంచి విదేశాల్లోనే ఉంటూ వచ్చాడు. ఈ క్రమంలోనే అమెరికాలో అండర్ గ్రాడ్యుయేషన్ సైకాలజీ పూర్తి చేసిన ఆయన.. 2014లో హిందీ నటుడుగా కెరీర్ ప్రారంభించాడు.
ఈ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన్న జేమ్స్ 2016లో నీర్జాతో మరోసారి ఆడియన్స్ను పలకరించాడు. ఈ సినిమాకు ఏకంగా ఐదు అవార్డులను సొంతం చేసుకున్నాడు జెమ్స్. తర్వాత.. హిందీలో పద్మావత్, సంజు సినిమాల్లో విలన్ పాత్రలో మెప్పించాడు. ఇక ఇప్పుడు కుబేరతో సౌత్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. కుబేరలో ఆయన నటనకు ఎంతో మంది ప్రశంసలు దక్కాయి. ఇందులో బిలియనీర్గా మెరిసిన జేమ్స్.. చివరకు బిచ్చగాడిగా కనిపించడం ఆడియన్స్లో మరింత హైప్ను పెంచింది. దీంతో ఇప్పుడు తెలుగులో అతనికి అవకాశాలు రావడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.