టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప 2 లాంటి సాలిడ్ సక్సెస్ తర్వాత.. అట్లీ డైరెక్షన్లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిన్న కాక మొన్న ఆఫీషియల్గా అనౌన్స్ చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ను.. అప్పుడే పరుగులు పెట్టిస్తున్నారు టీం. గుట్టు చప్పుడు కాకుండా పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకుని.. ముంబైలో రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అనౌన్స్మెంట్ నుంచి ఇప్పటివరకు అన్ని పనులు చక్క చక్క జరిగిపోతున్న క్రమంలో.. నిన్న బన్నీ, మృణాల్పై కొన్ని కీలక సన్నివేశాలను కూడా పూర్తి చేశారట. ఈ సినిమాలో మృణాల్తో పాటు.. దీపిక పదుకొనే, జాన్వి కపూర్లు కూడా నటించనున్నట్లు సమాచారం. వీళ్ళు మాత్రమే కాకుండా.. మరో ఇద్దరు హీరోలు సైతం సినిమాలో మెరవనున్నారట. ఇక దీపిక సినిమాలో హీరోయిన్గా నటించనున్న విషయాని తాజాగా ఓ వీడియో ద్వారా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
మరి మృణాల్ ఠాకుర్, జాన్వి కపూర్లను ఈ రేంజ్లో ఎందుకు హైలెట్ చేయడం లేదు.. దీపిక పదుకొనే ముందు డైరెక్టర్ వాళ్ళను కాస్త డవున్ చేస్తున్నాడా.. అనే సందేహాలు సోషల్ మీడియాలో మొదలయ్యాయి. ఇదంతా పక్కన పెడితే.. సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది. ఈ సినిమాకు.. రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. వీటిలో ఒక టైటిల్ ని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించనున్నారట. ఇక ఈ రెండు టైటిల్స్ లో ఒకటి.. శక్తిమాన్, మరొకటి.. ఐకాన్ అని తెలుస్తుంది. రెండిట్లో ఏదో ఒక టైటిల్ కచ్చితంగా సినిమాకు ఫిక్స్ అవుతుందని అంటున్నారు. అయితే.. ఈ రెండు టైటిల్స్ ఆడియన్స్ను ఆకట్టుకునేలానే ఉన్నా.. శక్తిమాన్ అని టైటిల్ వైవిద్యమైన రెస్పాన్స్ను దక్కించుకుంటుంది.
కారణం.. చిన్నప్పటి నుంచి ఎంతోమంది చూసిన శక్తిమాన్ డైలీ చిల్డ్రన్ సీరియల్. ఈ క్రమంలోనే శక్తిమాన్ టైటిల్ రిచ్గా కూడా మేకర్స్ భావిస్తున్నారట. మరి కొద్ది రోజుల్లో గ్రాండ్ ఈవెంట్తో.. ఈ టైటిల్ అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇందులో బన్నీ సూపర్ హీరోగా కనిపించనున్నట్లు సమాచారం. వేరు వేరు ప్రపంచాలకు సంబంధించిన అన్నదమ్ముల కథగా ఇది రూపొందుతుందని.. ఇప్పటివరకు ఇండియన్ ఫిలిం హిస్టరీ లోనే లేని హాలీవుడ్ కాన్సెప్ట్ను సైతం.. టచ్ చేయలేకపోయినా వైవిధ్యమైన కథతో పాన్ వరల్డ్.. కుంభస్థలాన్ని కొట్టాలని అల్లు అర్జున్, అట్లీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. వచ్చేయడానికి సెకండ్ హాఫ్ లో షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసి.. 2027 సమ్మర్ నాటికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారట టీం.