అతనితో నటించడమే నేను లైఫ్లో చేసిన బిగ్ మిస్టేక్.. మీనాక్షి చౌదరి సెన్సేషనల్ కామెంట్స్..!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్న ముద్దుగుమ్మల లిస్ట్‌లో కచ్చితంగా యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి పేరు మొదట వినిపిస్తుంది. మిస్ ఇండియాగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు.. కెరీర్ ప్రారంభంలో పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. వరుస ఫ్లాపుల‌తో ఫేడౌట్ అవుతుంద‌ని అంతా భావించారు. ఇలాంటి నేపథ్యంలో హిట్‌తో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది మీనాక్షి. తర్వాత లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో వరస హిట్లు తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ సినిమాలకు ముందు ఆమె కెరీర్‌లో మట్కా, గుంటూరు కారం, మెకానిక్ రాఖీ లాంటి డిజాస్టర్ సినిమాలు సైతం ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే గతంలో తాను నటించిన స్టార్ హీరో గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. మీనాక్షి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అతనితో కలిసి నటించకపోయి ఉంటే బాగుండేదని లైఫ్‌లో నేను చేసిన పెద్ద తప్పు అదేనంటూ వివరించింది.

ఇంతకీ ఆ హీరో ఎవరు.. ఆ మూవీ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. ఇంతకీ సినిమా మరేదో కాదు.. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం గోట్. తమిళ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి హీరోగా నటించిన ఈ సినిమా.. గతేడాది భారీ అంచనాల నడుమ రిలీజై డిజాస్ట‌ర్‌గా నిలిచింది. విపరీతమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్‌తో రూ.400 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి.. కమర్షియల్‌గా సక్సెస్ అందుకున్నా సినిమా మాత్రం నెగటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక.. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్గా మెరిసింది. అయితే.. ఈ సినిమాలో తన పాత్రకు ఇంపార్టెన్సే లేదని.. అనవసరంగా ఈ సినిమా ఒప్పుకున్నాను అంటూ మీనాక్షి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి.

అంతేకాదు.. ఈమె మహేష్ గుంటూరు కారంలో సెకండ్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో కూడా ఆమె రోల్‌కు ప్రాధాన్యత లేదని చెప్పవచ్చు. కేవలం మహేష్‌కి సర్వీస్ చేసేందుకు ఆమెని ఈ సినిమాలో పెట్టినట్లు ఆడియన్స్ ఫీల్ అవుతారు. ఆమెకు ఉన్న డైలాగ్స్ కూడా అతి తక్కువ. మీనాక్షి చౌదరి గోట్ సినిమా చేసి తప్పు చేశానని వివరించింది. కానీ.. వాస్తవానికి ఆమె గుంటూరు కారం సినిమా చేయకుండా ఉండాల్సిందని ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మీనాక్షికి ఉన్న క్రేజ్‌ రీత్యా.. అలాంటి రోల్స్ లో నటించాల్సిన అవసరం అస్సలు లేదు. ప్రస్తుతం ఈమెకు టాలీవుడ్‌లో శ్రీలీలకు మించి పోయే రేంజ్‌లో క్రేజ్‌, డిమాండ్ ఏర్పడింది. గత రెండు సినిమాల్లో కూడా అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. రాబోయే రోజుల్లో ఇలాంటి సక్సెస్ఫుల్ పాత్రల్లో నటిస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకోవాలని.. టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ గా మీనాక్షి ఎదగాలని అభిమానులు ఆరాటపడుతున్నారు.