సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ సెలబ్రెటీల్ గా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న తర్వాత.. హీరో, హీరోయిన్ల నుంచి నటీనటుల వరకు.. కొత్త సినిమాల నుంచి.. వారి పర్సనల్ లైఫ్ వరకు.. అన్నింటిపై ఏదో ఒక రూమర్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. కొందరు వాటిని లైట్ తీసుకుంటే.. మరికొందరు మాత్రం వాటిపై రియాక్ట్ అవుతూ.. క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. వాస్తవం ఏంటో ఆడియన్స్కు తెలియజేస్తారు. ముఖ్యంగా.. సెలబ్రిటీస్ రిలేషన్ షిప్ గురించి ఎప్పటికప్పుడు పుకార్లు చెల్లరేగుతూనే ఉంటాయి. వారు ఇచ్చి పుచ్చుకునే కానుకల గురించి అయితే ఇక చెప్పనవసరమే లేదు.
అలా గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి కూడా ఒక గాలివార్త తెగ వైరల్ గా మారింది. అదేంటంటే హైదరాబాద్లో తాను ఉంటున్న ఇల్లు తను సంపాదించింది కాదని.. ఎవరో రాజకీయ నాయకుడు ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చాడు అంటూ వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. ఈ రూమర్ గురించి రకుల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. హైదరాబాద్లో ఇల్లు ఎవరో నాకు గిఫ్ట్ ఇచ్చారన్న వార్త చూసి మా నాన్న చాలా కోపం తెచ్చుకున్నారు. నిజానికి ఆ ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులన్నీ నేనే దగ్గర ఉండి చూసుకున్నా. అలాంటిది.. ఆ ఇల్లు సొంతం కాదని.. ఎవరో గిఫ్ట్ గా ఇచ్చారంటూ వార్త చూడగానే నాన్న భరించలేకపోయాడు.
కోపంతో ఊగిపోయాడు.. ఏంటిది.. నువ్వు కష్టపడి సంపాదించిన సొమ్మును ఎవరో బహుమతిగా ఇచ్చారని.. ఎలా రాస్తారు అంటూ ఫైర్ అయ్యారు. ఇలాంటి పనికిరాని రూమర్లకు అసలు మనం స్పందించాల్సిన అవసరం లేదని నచ్చ చెప్పా. నాన్న ఏమో రిప్లై ఇవ్వాల్సిందే అని పట్టుపట్టాడు. ఇలాంటి వార్తలు అసలు పట్టించుకోనక్కర్లేదని ఎలాగోలా ఆయనను కన్విన్స్ చేశా అంటూ రకుల్ వివరించింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు రక్కుల్ హైదరాబాద్ హౌస్ గిఫ్ట్ ఇచ్చారు అంటూ వచ్చిన వార్తలకు చెక్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇక టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ అమ్మడు.. తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోను పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఇటీవల బాలీవుడ్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్న ఈ అమ్మడు ఇండియన్ 3, దే ప్యార్ దే 2 సినిమాల్లో మెరిసింది.