సాధారణ ప్రజలకే కాదు.. సినీ ఇండస్ట్రీలో ఉండే ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు, హీరో, హీరోయిన్లు, దర్శకులకు కూడా సెంటిమెంట్లు ఉంటాయి. సినిమాను ప్రారంభించాలంటే ఎప్పుడు పూజా కార్యక్రమాలు ప్రారంభించాలి.. ఏ దర్శకుడుతో సినిమా చేస్తే హిట్ కొడతాం.. ఏ హీరోయిన్తో చేస్తే మనకు కలిసొస్తుంది.. ఇలాంటివి కొందరు హీరోలు చాలా బలంగా నమ్ముతారు. సెలబ్రిటీలకు సెంటిమెంట్ అనేది ఉంటూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా విషయంలో ఓ ఫ్లాప్ సెంటిమెంట్ అభిమానులను భయపెడుతుంది. బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబోలో రూపొందుతున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ వార్ 2తో.. ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్ లో అడుగు పెట్టనున్నాడు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ కొత్త సెంటిమెంట్ బయటకు వినిపిస్తుంది.
గతంలో టాలీవుడ్ నుంచి పలువురు హీరోలు హిందీలో తమ సినిమాలను రిలీజ్ చేసిన.. వాటితో సరైన రిజల్ట్ అందుకోలేకపోయారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పరిస్థితి ఏంటనే సందేహాలు అందరిలో మొదలయ్యాయి. గతంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జంజీర్.. రీమేక్తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి డిజాస్టర్ ఎదురుకున్న సంగతి తెలిసిందే. ప్రియాంక చోప్రా హీరోయిన్గా, అపూర్వ లాకియా దర్శకత్వం వహించిన సినిమా తెలుగులో తుపాకీగా రిలీజ్ అయింది. ఇక సినిమా రెండుచోట్ల ఒకే ఫలితాన్ని దక్కించుకుంది. దీంతో బాలీవుడ్ లో మొదటి అడిగే చరణ్ కు ఎదురు దెబ్బ తగిలింది. అలాగే టాలీవుడ్ నుంచి అడుగుపెట్టిన మరో యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. చత్రపతి సినిమా హిందీలో రీమేక్ అయింది. వి.వి. వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ హైప్తో తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.
అంతే కాదు.. పాన్ ఇండియన్ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్న ప్రభాస్.. హిందీ దర్శకుడుఓం రౌత్తో చేసిన ఆది పురుష్ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుందో చూసాం. ఈ క్రమంలోనే మన టాలీవుడ్ హీరోస్ బాలీవుడ్ లో సినిమాలు చేసేందుకు అస్సలు ఆసక్తి చూపడం లేదు. అయితే ఇప్పుడు వైఫల్యాల పరంపర అందర్నీ కన్ఫ్యూజన్ కు గురిచేస్తుంది. తారక్ వార్ 2తో బాలీవుడ్ లో లాంచ్ అవుతున్న క్రమంలో.. ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. ఇందులో తారక్ నెగటివ్ రోల్ లో నటిస్తుండగా.. హీరోగా హృతిక్ రోషన్ ఉన్నాడు. వార్ ఫ్రాంచైజ్ లో భాగంగా వచ్చిన వార్ 2లో టాలీవుడ్ మార్కెట్ కోసం ఎన్టీఆర్ను రంగంలోకి దించారు. అయితే.. చరణ్, ప్రభాస్ లా బాలీవుడ్ వైఫల్యం చూసిన ఫ్యాన్స్.. ఇప్పుడు తారకపై ఎలాంటి ప్రభావం పడుతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.