వారణాసిలో ‘ వీరమల్లు ‘ ఫ్రీ రిలీజ్.. స్పెషల్ గెస్ట్ ఎవరో అసలు గెస్ చేయలేరు..?

టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్‌ను భారీ లెవెల్‌లో ప్లాన్ చేస్తున్నాడు నిర్మాత ఏ.ఎం.రత్నం. పవన్ ఫ్యాన్స్‌కు.. ప్రతిరోజు షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చేలా డిజైన్ చేశాడు. నిన్న జరిగిన ప్రెస్ మీట్ ఈవెంట్ ఎంత గ్రాండ్ గా చేశారో అంతా చూస్తూనే ఉన్నాం. ఇంకా అలాంటి రెండు గ్రాండ్ ఈవెంట్స్ డిజైన్ చేసినట్లు ఏ.ఏం.రత్నం ఈ ప్రెస్ మీట్‌లో అఫీషియల్‌గా వెల్లడించాడు. అందులో ఒకటి మెయిన్ గా చేసే ప్రీ రిలీజ్ ఈవెంట్ కాగా.. మరొకటి ఉత్తరప్రదేశ్‌లోని.. వారణాసిలో వేలాది మంది అభిమానుల మధ్యన జరిగే గ్రాండ్ రిలీజ్ ఈవెంట్.

పుష్ప 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్ బీహార్‌లో ఏ రేంజ్లో జరిగిందో తెలిసిందే. అంతకు రెండింతలు మించే రేంజ్‌లో ఈ ప్రమోషన్స్ ఉండనున్నయట. అంతేకాదు.. ఈ ఈవెంట్‌కి స్పెషల్ అతిథిగా ఎవరు రాబోతున్నారు అసలు గెస్ చేయలేరు. అతను ఎవరో కాదు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. పవన్ కళ్యాణ్‌కి రాజకీయ నాయకుడిగా సౌత్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో.. నార్త్ ఇండియా మొత్తం పై కూడా యోగి ఆదిత్యనాథ్‌కు అదే రేంజ్‌లో పాపులారిటీ ఉంది. ఇక నార్త్ ఇండియాలో పవన్ కళ్యాణ్‌ని అందరూ.. ఇటీవల యోగి ఆదిత్యనాథ్‌తో కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు.

Iam - The makers of #HariHaraVeeraMallu are planning a pre-release event in  Tirupati, Andhra Pradesh, and another promotional event in Varanasi. They  are planning to invite UP CM Yogi Adityanath as the

అంతటి పవర్ఫుల్ లీడర్ గా భవించే పవన్ కు.. సపోర్ట్ గా యోగి ఆదిత్యనాథ్ ప్రమోషన్స్ లో పాల్గొననున్నాడట. ఇక వీళ్ళిద్దరూ కలిసి ఒకే స్టేజిపై కనిపిస్తే సినిమాకు పాన్ ఇండియా లెవెల్ లో పబ్లిసిటీ ఏర్పడుతుంది అనడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజై మంచి రిజల్ట్ అందుకుంటే మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి కలెక్షన్ల వర్షం కొల్ల‌గొడుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే సినిమాపై భారీ పబ్లిసిటీ నెలకొన్న క్రమంలో.. సినిమా ట్రైలర్ ఈనెల 27న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే టీం ప్రకటించారు. ఇక ఈట్రైలర్ ఏ రేంజ్ లో ఆడియన్స్‌ను ఆకట్టుకొనుందో వేచి చూడాలి.