కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. టాలీవుడ్ ఆడియన్స్లోను తిరుగులేని క్రేజ్, పాపులారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఏడుపదుల వయసులోనూ ఇప్పటికీ తన స్టైల్, మ్యానరిజంతో ఆడియన్స్ను ఆకట్టుకుంటున్న రజినీ.. తన సినిమాలతో మేకర్స్కు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. అయితే రజినీ నుంచి చివరిగా రిలీజ్ అయినా వేటయాన్ సినిమా మాత్రం భారీ అంచనాల నడుమ రిలీజ్ అయి.. ఆడియన్స్ను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే రజిని తన నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని ప్రయత్నల్లో ఉన్నారు. అలా ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో రజినీ.. కూలీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున విలన్ పాత్రలో మెరవనున్నాడు. ఇక ప్రస్తుతం.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను.. ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు టీం. ఇదిలా ఉంటే.. రజినీకాంత్ తాజాగా ఓ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్కు గ్రిన్ సిగ్నల్ ఇచ్చాడంటూ ఓ న్యూస్ నెటింట తెగ వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో.. ప్రొడ్యూసర్ ఎవరు.. అనే వివరాలను ఒకసారి తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్న వారిలో వివేక్ ఆత్రేయ ఒకరు. ఇక తాజాగా కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్తో.. ఆత్రేయ మూవీ ఛాన్స్ కొట్టేసాడట.
ఇప్పటికే వివేక్.. రజినీకోసం ఒక కథను రెడీ చేసి.. ఆయనకు వినిపించాడని.. ఈ కథ విన్న రజినీకాంత్.. వెంటనే స్టోరీ నచ్చడంతో ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడంటూ తెలుస్తోంది. అంతేకాదు వివేక్, రజిని కాంబోలో తెరకెక్కనున్న ఈ క్రేజి సినిమా కోసం.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ ప్రొడక్షన్ బ్యానర్ అయిన మైత్రి మేకర్స్ రంగంలోకి దిగనుందని సమాచారం. ఒకవేళ ఇదే వాస్తవం అయితే మాత్రం.. నిజంగానే రజిని, వివేక్ సినిమాపై టాలీవుడ్ ఆడియన్స్ తో పాటు.. తమిళ్ ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు నెలకొంటాయి అనడంలో సందేహం లేదు. ఇక ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియాలంటే మేకర్స్ అఫీషియల్గా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.