నందమూరి కుటుంబం నుంచి మూడోతరం ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నాడు. నందమూరి హరికృష్ణ మనవడు.. జానకిరామ్ కుమారుడైన తారక రామారావును హీరోగా వైవిఎస్ చౌదరి ఓ సినిమాను రూపొందించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. న్యూ టాలెంట్ రోర్స్ పతాకంపై ఆయన సతీమణి గీతా ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతోపాటు.. స్పెషల్ గెస్ట్లుగా గారపాటి లోకేశ్వరి, దగ్గుపాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి పాల్గొని సందడి చేశారు. హీరో, హీరోయిన్లపై భువనేశ్వరి క్లాప్ కొట్టి వారికి అభినందనలు తెలియజేశారు. 1980 బ్యాక్ డ్రాప్లో కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్కి వ్యవహరించాలన్న ఈ సినిమా తెలుగు భాషకు మరింత ఖ్యాతి పెంచనుందని సమాచారం. ఈ సినిమాతో హైందవ సంస్కృతి తెలుగు భాష గొప్పతనం గురించి ప్రేక్షకులు మాట్లాడుకునేలా వైవిఎస్ రూపొందించనున్నారట.
ఈ సినిమాకు నేపద్యమే బలం కానుందని.. వైవిఎస్ చెప్పుకొచ్చాడు. ఇక ఇందులో ఎన్టీఆర్ సరసన కూచిపూడి డ్యాన్సర్ అచ్చ తెలుగు అమ్మాయి విణారావును హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ ఎంత కీర్తి సంపాదించుకున్నాడో ఈ బుల్లి ఎన్టీఆర్ కూడా అలానే తారక రామారావు కూడా ఎదగాలని కోరుకుంటున్నా.. తన వునికిని చాటుకోవడం కోసం రామ్ చాలా కష్టపడుతున్నాడు. ఆ తపన ఉన్న వారంతా కచ్చితంగా మంచి సక్సెస్ సొంతం చేసుకుని తీరుతారంటూ భువనేశ్వరి పేర్కొంది. ఇక లోకేశ్వరి మాట్లాడుతూ నాన్నకు ఎవరు సాటిరారు. ఆయన లెగసీని ముందుకు తీసుకువెళ్ళడానికి ఇప్పటివరకు కొడుకులు, మనవాళ్లు కృషి చేశారు. ఇకపై మునిమనవడు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నాడు. మీడియా ప్రోత్సాహం అతనికి ఎంతగానో అవసరం. అందరూ తారక రామారావును అభినందించండి.. వైవిఎస్ గారికి కృతజ్ఞతలు అంటూ లోకేశ్వరి చెప్పుకొచ్చింది.
ఇక పురందేశ్వరి మాట్లాడుతూ.. ఈరోజు నందమూరి ఫ్యామిలీ నుంచి మరో తరం ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. కళామ్మతల్లి దీవెనలు కళాకారుడిగా శ్రమ ఉంటే ఉన్నత శిఖరాలు ఎన్టీఆర్ అధిరోహిస్తాడు. మా నాన్న ఒక కళాతపస్వి. ఆయన క్రమశిక్షణతో సినిమా రంగానికి తన జీవితాన్ని అంకితం చేశారు. అందుకే ఆయన పేరును భారతీయ సినీ రంగంలో సువర్ణ అక్షరాలతో లిఖించబడింది. తర్వాత బాలయ్య, హరికృష్ణ ఇద్దరు చలనచిత్ర రంగంపై చెరగని ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ అంకితభావంతో తమ ఉనికిని చాటుకుంటున్నారు. ఇప్పుడు మరో తరం ఇండస్ట్రీలోకి వస్తుంది. మేమంతా రామని పిలుచుకునే మా ఎన్టీఆర్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. అతడికి కూడా కళామతల్లి ఆశీర్వాదం కుటుంబ సభ్యుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. వైవిఎస్ చౌదరి గారికి అభినందనలు అంటూ పురందేశ్వరి మాట్లాడింది. ఇక ప్రస్తుతం ఈ సినిమా ఓపెనింగ్కు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.