టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 29లో మెయిన్ విలన్ ఎవరో ఇప్పటివరకు రివీల్ కాలేదు. ఇక ఓ కీలక పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కానీ.. అది మెయిన్ విలన్ పాత్ర కాదంటు టాక్ ఎప్పటి నుంచో వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఇక మొదటి నుంచి రాజమౌళి సినిమాలో విలన్ పాత్రలంటే చాలా డిఫరెంట్గా డిజైన్ చేస్తూ ఉంటాడు జక్కన్న. ఎలాంటి ఇమేజ్ లేని నటుల్ని తీసుకువచ్చి.. భారీ హైప్ క్రియేట్ చేయడమే అతన్ని స్పెషాలిటీ. ఈ క్రమంలోనే ఎస్ఎస్ఎంబి 29 గ్లోబల్ లెవెల్ లో రూపొందిస్తున్న నేపథ్యంలో.. విలన్ విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నాడట జక్కన్న.
ఓ నల్లజాతీయుడిని ఈ సినిమాలో విలన్గా చూపించబోతున్నాడు అంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఆఫ్రికన్ అడవుల్లో సాగే అడ్వెంచర్స్ థ్రిల్లర్ కావడంతో.. నల్లజాతీయుడు అయితే.. పాత్ర పర్ఫెక్ట్ గా ఉంటుందని ఉద్దేశంతో.. అతనిని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు.. ఆ నల్లజాతీయుడు ఇమేజ్ కూడా వైరల్ గా మారుతుంది. ఇంతకీ అతను ఎవరో.. అతన్ని బ్యాగ్రౌండ్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఆ నల్లజాతీయుడు హాలీవుడ్ నటుడు డ్డిమోన్ గాస్టన్ హౌన్సా. డ్డిమోన్ను జక్కన ఈ మూవీ కోసం సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఇటీవల లండన్ వెళ్లిన రాజమౌళి.. అతనితో చర్చలు జరిపాడని ఇతడి పాత్ర ఆఫ్రికాని హంటర్గా తీర్చిదిద్దనున్నట్లు టాక్ వైరల్ గా మారుతుంది.
మహేష్ని వెంటాడే అసలు విలన్గా డ్డిమోన్ కనిపించనున్నాడట. దీంతో ఈ పేరు నెటింట తెగ వైరల్ గా మారుతుంది. ఇప్పటికే డ్డిమోన్పై సెర్చింగ్స్ మొదలైపోయాయి. కాగా హాలీవుడ్లో ఇప్పటికే చాలా సినిమాల్లో నటించిన డ్డీమోన్.. రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. వితౌట్ యు ఐ యాం నథింగ్ సినిమాతో కెరీర్ను ప్రారంభించిన డ్డిమోన్ ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. గ్లాడియేటర్, ఫోరియర్స్ 7, పాస్ ఆఫ్ ప్యూర్.. రెబల్ మూన్ లాంటి ప్రతిష్టాత్మక సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న డ్డిమోన్.. ప్రస్తుతం హాలీవుడ్లో మాన్స్టర్, డిజిలోట్ సినిమాల్లో కనిపించనున్నాడు.