ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో.. నెంబర్ వన్ బ్యూటీగా దూసుకుపోయిన రకుల్ ప్రీత్ సింగ్.. తాజాగా తన పర్సనల్ విషాయాలతో వార్తల్లో వైరల్ గా మారుతుంది. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సరసన నటించి తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల కెరీర్ పరంగా డీలా పడిపోయింది. బాలీవుడ్, హలీవుడ్ లాంటి ఇతర ఇండస్ట్రీలో ప్రయత్నాలు మొదలుపెట్టిన క్రమంలో.. సరైన సక్సెస్ దక్కించుకోలేక సతమతమవుతుంది. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన రకుల్ ప్రీత్.. పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా కనిపిస్తుంది. కాగా రకుల్.. ఇటీవల అబార్షన్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ అబార్షన్ పై మాట్లాడుతూ.. ఇది శారీరకంగానే కాదు మానసికంగాను తీవ్రంగా బాధించే చర్య అంటూ చెప్పుకొచ్చింది. స్కిన్ పై ఒక చిన్న పొర తీస్తేనే మనకు ఎంతో నొప్పి వస్తుంది. అలాంటిది శరీరంలో ఉన్న ఒక జీవాన్ని తొలగించేస్తే ఇంకా ఎంత బాధ కలుగుతుందో అసలు ఎవరు ఊహించలేరు అంటూ ఆమె వివరించింది. చాలామంది అనుకోకుండా ప్రెగ్నెన్సీ వస్తే.. సులభంగా అబార్షన్ చేయించుకోవాలని చెప్పేస్తారు. కానీ.. ఆ నిర్ణయం వెనక ఎంత కష్టం, బాధ దాగి ఉంటుందో ఎవ్వరు అర్థం చేసుకోరు అంటూ ఆవేదనను వ్యక్తం చేసింది.
ఈ అభిప్రాయంతో రకుల్ ప్రీత్ సింగ్ ఎంతోమంది మహిళల భావనలను స్పష్టంగా ప్రపంచానికి తెలియజేసింది. ఐదుగురిలో ఇద్దరు మహిళలు మూడు నుంచి ఐదు అబార్షన్లు ఎదుర్కొంటున్నారని వివరించిన ఆమె.. మొదటినుంచి భర్తలు.. భార్యల బాధను అర్థం చేసుకుని మద్దతుగా నిలవాలి అంటూ చెప్పుకొచ్చింది. అబార్షన్ పై బహిరంగంగా చర్చించాల్సిన అవసరం ఉందని రకుల్ క్లారిటీ ఇచ్చింది. దీంతో రకుల్ కామెంట్స్ లో మారుతున్నాయి. రకుల్ ఇంత క్లియర్గా ఒక మహిళ ఆవేదన గురించి స్పష్టంగా తెలియజేయడంపై నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.