టాలీవుడ్ ఇండస్ట్రీలో థియేటర్ల బంద్ వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జూన్ 1 నుంచి థియేటర్లను మూసివేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించుకున్న నేపథ్యంలో.. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఈ సమస్యలపై పరిష్కారం కోసం ప్రొడ్యూసర్, ఎగ్జిబిటర్ల మధ్య కీలక సమావేశం జరగనుంది. మే 24న హైదరాబాద్లో జరగనుంది. ఇక ఈ సమావేశంలో.. ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు.. పరిష్కారానికి తగిన చర్యల గురించి చర్చించనున్నారు. ఇక ఎగ్జిబిటర్లు సినీ పరిశ్రమలో రెంటల్ విధానాన్ని రద్దుచేసి.. షేరింగ్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్లను ఈ సమావేశంలో వెళ్లబుచ్చనున్నారు.
ఇక.. ఇప్పటికే ఈ టాపిక్పై ఒకసారి చర్చలు జరిగిన.. అదేవిధంగా డిమాండ్లు చేయడంతో.. నిర్మాతలు మరోసారి చర్చలకు హజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాలలో నుంచి ఈ మీటింగ్ కోసం ప్రముఖ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఎగ్జిబిటర్లు హాజరుకానున్నారు. ఎగ్జిబిటర్ల సమస్యలు అలాగే.. అద్దె విధానం రద్దు చేయడం గురించి, షేరింగ్ విధానాలను అమల్లోకి తీసుకురావడం గురించి.. థియేటర్లో బంద్ నిర్ణయం పై అన్ని విధాల చర్చలు జరగనున్నాయి.
తాజాగా.. ఈనెల 27న ప్రొడ్యూసర్, ఎగ్జిబిటర్ జాయింట్ మీటింగ్ ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేశారు. మీటింగ్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి.. వాళ్ళ నిర్ణయాన్ని ఫిలిం ఛాంబర్ అఫీషియల్ గా ప్రకటించనుంది. అయితే.. అప్పటివరకు థియేటర్లు మూసి వేయకుండా.. సమ్మె పక్కన పెట్టేలా నిర్మాతలు ఎగ్జిబిటర్లతో మాట్లాడుకున్నారట. చివరిగా జరిగిన సమావేశంలో థియేటర్ల బంద్.. జరగకుండా సినిమాలో థియేటర్లలో రన్ చేస్తూనే.. ఈ వివాదంపై సమావేశం అవ్వాలని నిర్ణయించుకున్నారు డిస్ట్రిబ్యూటర్స్. అందులో భాగంగా నేడు జరగనున్న ఈ మీటింగ్లో ఫైనల్ డెసిషన్ వెలుబడుతుందా.. లేదా.. ఇప్పుడు జరగనున్న ఈ చర్చలు ఫలిస్తాయా.. లేదా.. వేచి చూడాలి.