ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రెంటల్ సిస్టంలో కాదని.. పర్సంటేజ్ కు సినిమాలు పడితే.. తమకు వచ్చే నష్టం గురించి.. దానిని ఎలా తగ్గించుకోవాలని విషయంపై సతమతమవుతున్నారు డిస్ట్రిబ్యూటర్లు. అయితే.. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ నిర్ణయం పై అసలు వెనక్కి తగ్గే అవకాశం లేదంటూ.. ఇప్పటికే వాళ్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు రోజులు లెక్కేస్తున్నారు. కాగా బుధవారం విడివిడిగా జరిగిన ఎగ్జిబిటర్, ప్రొడ్యూసర్స్ మీటింగ్లో వారు ఎటు తేల్చలేని పరిస్థితి నెలకొంది.
నిజానికి ఎంతో మంది నిర్మాతల్లోనే బయర్లు, ఎగ్జిబిటర్లు ఉన్న నేపథ్యంలో.. ఈ సమస్యను పరిష్కరించడానికి సినీ ఛాంబర్ నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్స్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ల మూడు సెక్టార్ల నుంచి కొందరిని సెలెక్ట్ చేసుకుని ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ సమస్యకు సరైన పరిష్కారం వెతకాలని కోరనున్నట్లు టాక్. ఈ క్రమంలోనూ మూడు సెక్టర్ల కలిసి జాయింట్గా వేసే కమిటీ మీటింగ్.. మే 24 శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరగనుందట. రెంటల్ పర్సంటేజ్ విషయాలపై చర్చలు జరిపి.. వచ్చే కష్టనష్టాల గురించి సమగ్రంగా చర్చించిన తర్వాత నిర్ణయాన్ని టాలీవుడ్ ఇండస్ట్రీ వెల్లడించనుందని సమాచారం.
ఎగ్జిబిటర్స్ కోరినట్టుగా పర్సంటేజ్ సిస్టంకు నిర్మాతలు.. పంపిణీ దారులు గ్రీన్ సిగ్నల్ ఇస్తే పర్వాలేదు. లేదంటే మాత్రం థియేటర్ల బంద్ తప్పదని టాక్. అయితే.. జూన్ 5న కమలహాసన్, మణిరత్నం పాన్ ఇండియన్ మూవీ థగ్ లైఫ్, 12న పవన్ కళ్యాణ్.. హరిహర వీరమల్లు సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో.. వాతావరణం కాస్తంత హీట్ ను పెంచేస్తుంది. ఈ రెండు పెద్ద సినిమాల రిలీజ్కు ఆటంకం కలగకూడదని.. థియేటర్లను రన్ చేయాల్సిందేనని.. ఏమైనా సమస్యలు ఉంటే నిదానంగా మాట్లాడుకోవాలని.. ఎగ్జిక్యూటర్స్ను.. నిర్మాతలు, పంపిణీ దారులు బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఎగ్జిబిటర్స్ వీరి మాటలను లెక్క చేస్తారా.. లేదా.. బేకాతరు చేసి.. ఇబ్బందులు కొనసాగిస్తారా వేచి చూడాలి. నిజానికి.. ఇలాంటి పెద్ద సినిమాల రిలీజ్ టైం లో మాత్రమే నిర్మాతలు, బయ్యర్లు మా మొరో ఆలకిస్తారని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు.