టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు 41వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎప్పటికి ఎంతోమంది స్టార్ సెలబ్రెటీస్, ప్రముఖులు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన పేరు మారుమోగిపోతుంది. అతి చిన్న వయసులో నటుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. ఆది, సింహాద్రి సినిమాలతో స్టార్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం ఆచితూచి సినిమాలను ఎంచుకుంటున్న తారక్.. వార్ 2, డ్రాగన్, దేవర 2 సినిమాలతో పాటు నెల్సన్ డైరెక్షన్లో మరో సినిమాలో నటించనున్నాడు. కాగా ఆర్ఆర్ఆర్తో గ్లోబల్ రేంజ్లో క్రేజ్ను సంపాదించుకున్న ఎన్టీఆర్.. ఇప్పటివరకు రాజమౌళితో ఏకంగా నాలుగు సినిమాలకు పనిచేశాడు. మహేష్ బాబు సినిమా చేసిన తర్వాత.. రాజమౌళి, తారక్తో మరో సినిమా చేయనున్నట్లు సమాచారం.
కాగా.. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్న వారిలో జపాన్ లో సైతం క్రేజ్ సంపాదించుకున్న ఏకైక హీరో ఎన్టీఆర్ కావడం విశేషం. తమిళ్ నుంచి రజినీకాంత్ ఈ గౌరవం సొంతం చేసుకోగా.. తెలుగు నుంచి ఎన్టీఆర్కు మాత్రమే ఈ గౌరవం దక్కింది. ఆయన కటౌట్కు మహిళా అభిమానులు జపాన్లో పాలాభిషేకం చేశారంటూ.. ఆయన ఏ రేంజ్లో క్రేజ్ సంపాదించుకున్నాడో అర్ధం చేసుకోవచ్చు. అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. బి. గోపాల్ డైరెక్షన్లో తెరకెక్కిన తారక్.. నరసింహుడు సినిమాల్లో ఫస్ట్హాఫ్ చివరి వరకు కూడా ఎక్కడ తారక్ వాయిస్ వినపడదు. తెలుగులో ఈ తరహా ప్రయోగం ఇప్పటివరకు ఎవరు చేయలేదు. కేవలం ఈ రికార్డ్ ఎన్టీఆర్కు దక్కింది. ఇక పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా సంచలన సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో తారక్ నటన, డైలాగ్ డెలివరీ ఆడియన్స్ను ఫిదా చేసింది. ఇక ఈ సినిమా టీవీలో ప్రసారమైన.. ఇప్పటికీ జనం టీవీలకు అతుక్కుపోయి మరి చూస్తారు. అయితే ఈ సినిమా మొదటిసారి టీవీలో ప్రసారమైనప్పుడు 29.8 టిఆర్పి రేటింగ్ సాధించి సంచలన రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటివరకు మరే తెలుగు సినిమాకు హీరోయిన్స్లో టిఆర్పి రాలేదు. ఇప్పటికీ సినిమా టెలికాస్ట్ అవుతుంది అంటే 20 కి తగ్గకుండా టిఆర్పి వస్తుంది. అలా.. ఇప్పటివరకు తన కెరీర్లో ఎన్నో రికార్డులను నెలకొల్పిన తారక్.. ప్రస్తుతం వార్ 2, ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఈ రెండు సినిమాలపై ఇప్పటికే ఆడియన్స్లో పీక్స్ లెవెల్ ఆంచనాలు నెలకొన్నాయి. మరి ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగా రిజల్ట్ వస్తుందో, లేదో వేచి చూడాలి.