స్టార్ బ్యూటీ త్రిప్తి దిమ్రికి టాలీవుడ్ ఆడియన్స్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ అమ్మడి పేరే మారుమోగిపోతుంది. న్యూఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ అమ్మడు.. సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించినా.. 2023లో రిలీజ్ అయిన యానిమల్ సినిమాతో మాత్రం అమ్మడికి భారీ క్రేజ్ ఏర్పడింది. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అంతకుముందే.. బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించినా.. త్రిప్తికి సరైన సక్సెస్ రాలేదు. కానీ.. సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ సినిమాల్లో.. ఈ అమ్మడు సెకండ్ హీరోయిన్గా నటించి భారీ క్రేజ్ను దక్కించుకుంది. తర్వాత బాలీవుడ్లో వరుస సినిమాల్లో బిజీగా మారిపోయింది.
ఇలాంటి క్రమంలో.. పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డివంగ డైరెక్షన్లో రూపొందుతున్న స్పిరిట్లో అమ్మడు హీరోయిన్గా ఛాన్స్ కొట్టేయడంతో.. అమ్మడి పేరు మరింత ట్రెండింగ్గా మారుతుంది. ఏకంగా ప్రభాస్తో రొమాన్స్ చేసే బంపర్ ఆఫర్ కొట్టేయడంతో.. అమ్మడికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు నెటింట తెగ వైరల్గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే త్రిప్తి ఆస్తుల విలువ కూడా హాట్ టాపిక్గా మారింది. తృప్తికి ముంబైలోని భాంద్ర ఏరియాలో.. లగ్జరీ అపార్ట్మెంట్ ఉండటం.. షారుక్ ఖాన్, రణ్బీర్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోల ఇళ్లకు సమీపంలో ఈ అపార్ట్మెంట్ కొనుగోలు చేసింది.
దీని విలువ ఏకంగా రూ.14 కోట్లు. అలాగే ప్రస్తుతం త్రిప్తి ఓ సినిమాకు రూ.4 నుంచి రూ.6 కోట్ల రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుంది. మరోవైపు వెబ్ సిరీస్లు, బ్రాండ్ అంబాసిడర్గా పలు యాడ్స్ కూడా నటిస్తూ డబ్బులు అర్జస్తోంది. ఈ క్రమంలోనే పలు నివేదికల ప్రకారం త్రిప్తి ఆస్తుల విలువ దాదాపు రూ.30 కోట్ల వరకు ఉంటుందట. ఇక ఈ విషయం తెలియడంతో నెటిజన్లు ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే ఈ రేంజ్ లో అస్తులు కూడబెట్టడంతో స్టార్ హీరోలను ఈ అమ్మడు డామినేట్ చేస్తుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.