టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల్లో తన వేగాన్ని మరింతగా పెంచాడు. ఇప్పటికి హరిహర వీరమల్లు షూట్ను పూర్తి చేసిన ఆయన.. సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను కూడా సరవేగంగా ముగించాడు. ఈ విషయాన్ని మూవీ టీం అఫీషియల్గా ప్రకటిస్తూ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. హరిహర వీరమల్లు డబ్బింగ్.. ఫోకస్ పేరుతో పవన్ కళ్యాణ్ గంటల వ్యవధిలోనే పూర్తి చేసేసారని.. ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా.. రాత్రి పది గంటలకు డబ్బింగ్ మొదలుపెట్టి నాలుగు గంటల్లో ఆ డబ్బింగ్ పనులన్నీ ముగించారని చెప్పుకొచ్చాడు.
ఇక పవర్ తుఫాన్కు సిద్ధమవుతుందంటూ పేర్కొన్నారు. జూన్ 12న మీ ఉత్తేజం మరింతగా ఉరకలేస్తుందని.. టీం వెల్లడించారు. పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో.. పవన్ కళ్యాణ్ పోరాట యోధుడిగా కనిపించనున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్గా.. ఏ.ఏం. రత్నం ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా.. గత కొద్డేళ్ళుగా వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. మొదట క్రిష్ డైరెక్షన్లో ప్రారంభమైన ఈ సినిమా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో షూట్ను ముగ్గించింది.
ఇక ఈ సినిమాలో బాబి డియోల్, అనుపమ కేర్, సత్యరాజ్ తదితరులు కీలకపాత్రలో మెరవనున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతున్న నేపథ్యంలో.. ఫస్ట్ పార్ట్ హరిహర వీరమల్లు పార్ట్ 1.. స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో టీం రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఇప్పటికే ఆడియోస్ లో పీక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నయి. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.