టాలీవుడ్ క్రేజీ హీరోస్ మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ భైరవం. షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ మూవీని కె.కె.రాధా మోహన్ నిర్మించగా.. ఆనంది, అధితి శంకర్, దివ్య పిళ్ళై హీరోయిన్లుగా మెరుశారు. ఇక మే 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్ లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు టీం. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. అయితే.. రిలీజ్ తేదీ దగ్గర పడుతున్న క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా ఆదివారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ లెవెల్ లో నిర్వహించారు టీం. ఈ ఈవెంట్లో భాగంగా.. డైరెక్టర్ విజయ్ కనకమేడలా మాట్లాడుతూ చేసిన కామెంట్స్ నెటింట వివాదంగా మారాయి.

ధర్మాన్ని కాపాడడానికి సంవత్సరం క్రితం ఏపీకి ఒక వ్యక్తి ఎలా వచ్చాడో.. అలాగే మా సినిమాలో కూడా ధర్మాన్ని కాపాడడానికి కాలభైరవుడు వచ్చాడు అంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి విజయ్ కనుకమేడల కామెంట్స్ చేశారు. దీనిపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. వైసీపీ పాలనపై విమర్శలు చేయడం అసలు సరైన విధానమే కాదంటూ.. సినిమా ఫంక్షన్ లో పొలిటికల్ కామెంట్స్ ఏంటి అంటూ.. సినిమా ప్రమోషన్ సినిమా ప్రమోషన్స్ లా ఉండాలి.. రాజకీయాల్లోకి ఎందుకు తలదూరుస్తున్నారు అంటూ.. మండి పడుతున్నారు.
విజయ్ కనకమెడల చేసిన ఈ కామెంట్స్ను మరింత ట్రెండ్ చేస్తూ.. భైరవం సినిమాను బ్యాన్ చేయాలంటూ.. బాయ్కాట్ బైరవం అనే హ్యాష్ ట్యాగ్లను జోడిస్తూ.. పోస్టులను తెగ వైరల్ చేస్తున్నారు. సినిమాల గురించి మాట్లాడుకోక.. రాజకీయాల గురించి ఎందుకు.. ఇప్పటికే ఇలా మాట్లాడిన వాళ్ల సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.. అయినా మీరు వినరు.. ఈ సినిమాను కూడా ఫ్లాప్ కాయం అన్నట్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక దాదాపు 9 ఏళ్ల గ్యాప్ తర్వాత మంచు మనోజ్ నటించిన మూవీ భైరవం. ఈ సినిమాతో స్ట్రాంగ్ రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు మనోజ్. ఇలాంటి క్రమంలో సినిమా వివాదం అవుతుండడంతో.. ఆయన ఫ్యాన్స్ నిరాశని వ్యక్తం చేస్తున్నారు.