19 ఏళ్లుగా ఆ హీరోయిన్ పై పగతో మహేష్.. కారణం ఏంటంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా మహేష్ బాబు తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఎంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ ఇండస్ట్రీలో అందరితోనూ ఎంతో సన్నిహితంగా ఉంటాడు. ఇక కాంట్రవర్సీలకు ఆవడ దూరంలో ఉండే మహేష్.. ఎప్పటికప్పుడు తన పని తాను చేసుకుంటూ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇచ్చిన కాల్ షీట్స్ ను సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుని.. తమ స్కెడ్యూల్స్ ని పక్కా ప్లాన్ తో ముందుకు తీసుకు వెళుతూ పర్సనల్ గాను మంచి ఇమేజ్ తో రాణిస్తున్నాడు. టైం దొరికినప్పుడు అలా ఫ్యామిలీతో వెకేషన్ లో ఎంజాయ్ చేసే మహేష్.. మంచి పనుల్లోనూ తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. అలాంటి మహేష్.. ఒక హీరోయిన్‌తో ఏకంగా 19 ఏళ్ల నుంచి అసలు మాట్లాడడమే లేదని.. ఆమె అంటే అసలుకు మహేష్ కి నచ్చనే నచ్చదంటూ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు.. సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార. ఎస్.. మీరు విన్నది కరెక్టే. ఇక మహేష్, నయన్ ఇప్పటివరకు ఒకటంటే ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. కానీ.. వీళ్ళ కాంబోలో గతంలో ఎన్నో సినిమాలను ప్లాన్ చేశారట మేకర్స్. కాగా.. ఒక్క సినిమా కూడా వర్కౌట్ కాలేదు. వీళ్ళిద్దరి కాంబోలో మొదట మిస్ అయిన మూవీ పోకిరి. పూరి జగన్నా డైరెక్షన్‌లో ఇలియానా హీరోయిన్గా రూపొందిన ఈ సినిమా.. బాక్సాఫీస్ రికార్డులను బ్లాక్ చేయడమే కాదు.. ఈ సినిమా మహేష్ ఫ్యాన్స్ కి ఎప్పటికీ ఎవర్గ్రీన్‌ హిట్గా నిలిచిపోయింది. మొద‌ట హీరోయిన్‌గా నయనతారను భావించారట పూరి జగనాథ్.

కాగా.. నయనతార టైంలో సినిమా సైన్ చేయాలంటే క్రేజీ కండిషన్లు పెడుతూ వచ్చేది. ముఖ్యంగా.. సినిమా ప్రమోషన్స్ కి రాను అని అది అంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా నో అని చెప్పేసేది. ఈ క్రమంలోనే మహేష్ లాంటి స్టార్ హీరో సినిమాకు కూడా ఆమె అలాంటి కండిషన్స్ పెట్టడంతో.. మహేష్ బాబుకి కోపం వచ్చి.. ఆ హీరోయిన్ అసలు ఈ సినిమాలో వద్దే వద్దని తాగేసి చెప్పాడట. దీంతో వీళ్ళిద్దరి కాంబోలో సినిమా ఆగిపోయింది. తర్వాత ఆగడు , సరిలేరు నీకెవరు రెండు సినిమాల్లోనూ హీరోయిన్ నయనతారనే భావించారట. కానీ.. మహేష్ బాబు నయనతార నా సినిమాల్లో వద్ద‌ని చెప్పేసాడట. దీంతో 19 ఏళ్లుగా అసలు వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం లేదు సరి కదా.. కనిపించిన ఇద్దరు ఎడమొఖం పెడముఖంగా ఉంటారు. ముఖం తిప్పుకొని వెళ్ళిపోతారు.