తాజాగా మంచు విష్ణు కన్నప్ప హార్డ్ డిస్క్ మిస్ అవడం పెద్ద దుమారంగా నిలిచిన సంగతి తెలిసిందే. టీమ్ అంతా ఆందోళనలో ఉన్న క్రమంలో.. కన్నప్ప ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన విజయ్ హార్డ్ డ్రైవ్ మిసింగ్పై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ప్రస్తుతం పోలీసులు దీనికి సంబంధించిన దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే కేసు కొత్త మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగా కేసు పెట్టిన విజయ్కి కూడా పోలీసులు నోటీసులు అందించడం గమనార్హం. రెండు రోజుల్లో దర్యాప్తు అధికారి ఎదుట అధికారులతో విచారణకు హాజరుకావాలని.. ఈ నోటీసులో పేర్కొన్నారు. కేసు పెట్టిన నిర్మాతనే చోరీ దర్యాప్తులో భాగంగా విచారించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
అసలు మేటర్ ఏంటంటే.. కోకాపేటకు చెందిన రెడ్డి విజయ్ కుమార్.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. కాగా.. కన్నప్ప సినిమాకు కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్ ముంబైకి చెందిన విఎఫ్ఎక్స్ విక్రేతలలో ఒకరు.. డిటిడిసి కొరియర్ ద్వారా ఫిలింనగర్లో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయానికి పంపించగా.. డెలివరీ రికార్డుల ప్రకారం ఫార్మల్ ఈనెల 25న కార్యాలయానికి చేరుకుందని క్లారిటీ వచ్చింది. డీటీడీసీ కొరియర్ వచ్చిన సమయంలో ఆఫీస్బాయ్ రఘు దాన్ని అందుకున్నారు.
ఈ క్రమంలోనే విషయం తెలిసిన కార్యాలయ సిబ్బంది క్రాంతి.. హార్డ్ డ్రైవ్ విషయంపై రాఘను ప్రశ్నించుగా.. నేను దాన్ని చరితకు ఇచ్చాను అంటు వివరించాడు. అయితే ఆమె తప్పించుకుని తిరుగుతుండడంతో.. కావాలనే చరిత, రఘులు కొంతమంది ప్రమేయంతో ఈ ప్రాజెక్టుకు నష్టం కలిగించే ఉద్దేశంతోనే ఇలా హార్డ్ డ్రైవ్ తీసుకుని పరారయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. కాగా.. ఇలాంటి క్రమంలోనే ఎన్నిసార్లు వాళ్ళని సంప్రదించినా లాభం లేకపోవడంతో.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన రెడ్డి విజయకుమార్ ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.