సాధారణంగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా, దర్శకులుగా, నిర్మాతలుగా ఎదిగిన వారిని ఎవరైనా సాధారణ వ్యక్తులు కలవాలంటే.. వాళ్ళతో పనిచేసే వ్యక్తులలో.. కింద స్థాయి సిబ్బందిని పట్టుకుని రికమండేషన్లతో అవకాశాలు కొట్టేస్తుంటారు. కానీ.. ఓ డైరెక్టర్ మాత్రం ఫుల్ డిఫరెంట్ గా ప్రయత్నాలు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇంతకి ఆ డైరెక్టర్ చేసిన పని ఏంటంటే.. టాలీవుడ్ హీరో సాయి ధరంతేజ్కు కథ వినిపించే ఛాన్స్ కోసం పవన్ కళ్యాణ్ ని రికమండ్ చేయమంటూ డైరెక్టర్ అడిగాడట. ఇంతకీ అతను ఎవరో.. అసలు మేటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఆ డైరెక్టర్ మరెవరో కాదు విజయ్ కనకమేడల.
నాంది సినిమాతో అల్లరి నరేష్ను సరికొత్తగా చూపించి బ్లాక్ బస్టర్ కొట్టిన విజయ్.. తాజాగా రూపొందించిన మూవీ భైరవం. మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా.. మే 30న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ తన బ్యాగ్రౌండ్ గురించి.. పవన్ కళ్యాణ్ తో తన పని చేసిన దాని గురించి చెప్పుకొచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ.. నేను, హరీష్ శంకర్ చాలా క్లోజ్. హరీష్ శంకర్ రెండవ సినిమా నుంచి.. డిజె సినిమా వరకు నేను ఆయనతోనే పని చేశాను అంటూ వెల్లడించాడు. గబ్బర్ సింగ్ సినిమాకు పవన్ కళ్యాణ్ తో పనిచేయడం ఎప్పటికీ మర్చిపోలేను. సెట్లో అందరూ పవన్ కళ్యాణ్ అభిమానులే. కార్వాన్ కూడా అప్పుడప్పుడే వస్తున్నాయి. ఇక షాట్ గ్యాప్ ఉంటే.. సెట్ కి దూరంగా పవన్ కళ్యాణ్ గారు కూర్చునేవారు.
షాట్ రెడీ అని రమ్మనడానికి వెళ్తే.. ఓ రెండు రోజులు చూసి.. అక్కడ నుంచి పిలువు.. లేదా వాకిలో చెప్పేసిన నేను వచ్చేస్తా అని ఆయన అనడం నిజంగా నాకు ఆనందాన్ని కలిగించింది. ఆయనతో నేను బాగా క్లోజయ. ఇక.. పోలీస్ స్టేషన్ సాంగ్స్ కామెడీ సీన్ రెండున్నర రోజుల్లో మేము పూర్తి చేసేశాం. పవన్ కళ్యాణ్ గారికి స్టోరీ చెప్పలేదు కానీ.. గబ్బర్ సింగ్ ఇంటర్వెల్ షూటింగ్ టైంలో సాయి ధరమ్ తేజ్కి కథ చెప్పాలని పవన్ కళ్యాణ్ గారిని రికమండేషన్ అడిగా తేజ్ను కల్పించండని. అంతే.. పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ సెట్స్లోకి సాయి ధరంతేజ్నే తీసుకువచ్చి నాకు పరిచయం చేశారు. కొన్నేళ్లు స్టోరీ డిస్కషన్ జరిగాయి. కానీ.. వర్కౌట్ కాలేదు. తేజ్ తో సినిమా ఆగిపోయింది అంటూ వెల్లడించాడు. ప్రస్తుతం విజయ్ కనకమెడల కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.