టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటికీ ఎంతో మంది నటినటులు అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ స్టార్ సెలబ్రెటీస్ అంతా ఒక్కొక్కరు ఒక్కో ప్రదేశం నుంచి ఇండస్ట్రీకి వచ్చి సెట్ అయిన వారే. అయితే.. వీళ్ళలో చాలామంది సెలబ్రిటీస్ ఓ ప్రాంతం నుంచి ఇండస్ట్రీకి వచ్చిన వారే. హీరోలుగా, డైరెక్టర్లుగా, యాక్టర్లుగా ప్రతి రంగంలోనూ సత్తా చాటుకున్న వారే. ఇంతకీ ఆ ప్రాంతం మరేదో కాదు.. నిజామాబాద్.
నిజామాబాద్ నుంచి ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎంతోమంది అడుగుపెట్టారు. అలా.. టాలీవుడ్లో ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్గా తిరుగులేని క్రేజ్తో దూసుకుపోతున్న దిల్రాజు కూడా నిజామాబాద్కు చెందిన వ్యక్తి . టాలీవుడ్ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గానూ కొనసాగుతున్నారు. అంతేకాదు.. టాలీవుడ్ క్రేజీ హీరో నితిన్ కూడా నిజామాబాద్కు చెందిన వ్యక్తి. టాలీవుడ్లో స్టార్ హీరోల్లో ఒకరిగా ఆయన రాణిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు.
బుల్లితెర యాంకర్గా ఫుల్ బిజీబిజీగా గడుపుతున్న యాంకర్ శ్రీముఖి కూడా నిజామాబాద్కు చెందిన అమ్మాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒకరిగా కొనసాగుతుంది. అంతేకాదు.. సినిమాల్లోనూ పలు క్యారెక్టర్లో నటిస్తూ మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్.. కామారెడ్డికి చెందిన వ్యక్తి. అలాగే కామారెడ్డికి చెందిన మరో యాక్టర్ ఆదిత్య మ్యాకాల్ నటించి ప్రస్తుతం వెబ్ సిరీస్లో రాణిస్తుంది. కాగా గాంధారి మండలంలోని.. వెంకటాపురం గ్రామానికి చెందిన గిరిజన బిడ్డ చమ్మక్ చంద్ర బుల్లితెరపై కమెడియన్గా రాణిస్తున్నాడు.