పహల్గాం ఉగ్ర దాడి తర్వాత.. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర విషయంలో త్రివిధ దళాలు ఎంతో శ్రమించి విజయాన్ని సాధించాయి. పాకిస్తాన్ ఎదురు దాడులనింటిని స్ఫూర్తితో తిప్పి కొట్టాయి. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్తో కాల్పుల విరమణ నేపథ్యంలో ప్రధాని మోడీ మౌనాన్ని కొనసాగించారు. అయితే ఆపరేషన్ సింధుర్ ఇప్పటికీ కొనసాగుతుందని తాజాగా ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మోడీ.. ఈరోజు రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి మీడియా ముందు ప్రసంగించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆపరేషన్ సింధుర్ తర్వాత.. భారత సైన్యం పాకిస్తాన్పై ఎన్నో సక్సెస్లను అందుకుంది. ఉగ్రవాద శిబిరలపై దాడులతో ప్రారంభమైన భారత్ యుద్ధం.. తర్వాత పాకిస్తాన్ ఎయిర్ బేస్లు.. సైనిక స్థావరాలు వరకు వెళ్ళింది.
అంతేకాదు.. భారత్ పై ప్రతికారంతో పాకిస్తాన్ పంపిన డ్రోన్లను సైతం భారత్ వాయిసేన గగనతలంలోనే కుప్పకూల్చింది. ఇలాంటి క్రమంలో అనూహ్యంగా అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్ కాల్పుల విరమణకు ఇరుదేశాలు అంగీకరించాయి. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా సాగుతున్న నేపథ్యంలో.. ఆకస్మికంగా కాల్పులు విరమణ ప్రకటించడంపై దేశవ్యాప్తంగా మోదిపై తీవ్ర విమర్శలు తలెత్తాయి. పాకిస్తాన్పై దాడి చేసి విజయం సాధించేందుకు అన్ని అవకాశాలు ఉన్నా.. కాదని ట్రంప్ మాట విని కాల్పుల విరమణ ప్రకటించడం ఏంటి అంటూ.. ఆత్మహత్య సదృశ్యం అనే విమర్శలు తలెత్తాయి.
అంతేకాదు ఈ కాల్పుల విరమణ ప్రకటన చేసిన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మేస్త్రిని.. ఆయన కుటుంబాన్ని సైతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు. అయితే వీటిపై ప్రధానమంత్రి కానీ.. కేంద్ర ప్రభుత్వం గానీ.. ఇప్పటివరకు స్పందించలేదు. ఇలాంటి క్రమంలో మోడీ ఆపరేషన్ సింధూర్.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై జాతిని ఉద్దేశించి ప్రసంగం చేయనున్నాడు. ఇవాళ రాత్రి 8 గంటలకు టీవీలో ప్రధాని మోడీ ప్రసంగం ప్రారంభమవుతుంది. ఇందులో ఆపరేషన్ సింధూరం నుంచి కాల్పుల విరమణ తర్వాత చర్చల వరకు సాగిన అన్ని పరిణామాలను ప్రజలకు వివరించే అవకాశం ఉందట. ఇప్పటికే త్రివిశ దళాల ఆపరేషన్తో తాము సాధించిన విజయాలని ఆధారాలతో సహా ఏకరపు పెడుతుంది.