పుష్ప 2 కోసం అల్లు అర్జున్ ఏకంగా రూ.300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడని ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ఫోబ్స్ వెల్లడించింది. దీంతో.. ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న నటుడిగా అల్లు అర్జున్కు ఇమేజ్ క్రియేట్ అయింది. అయితే.. బన్నీ కానీ, ఇటు మూవీ టీం కానీ దీనిపై రిప్లై ఇవ్వలేదు. అంతేకాదు.. నిర్మాణ సంస్థ మూవీ మేకర్స్ డిసెంబర్ 24న సోషల్ మీడియా వేదికగా.. ఈ సినిమా కోసం ఇప్పటికే రూ.1508 కోట్ల గ్రాస్ వచ్చిందని వెల్లడించారు. ఈ క్రమంలోనే సినిమాకు రూ.300 కోట్లు తీసుకున్న బన్నీ.. ఒక ప్రాణానికి ఇచ్చిన విలువ రూ.25 లక్షలు. బన్నీ గత కొద్ది రోజుల క్రితం తన వంతుగా ఆ కుటుంబానికి సహాయం చేస్తానని రూ.25 లక్షలు ఇవ్వనున్నట్లు వీడియో ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే.
హైదరాబాదులోని.. సంధ్య థియేటర్ ఇష్యూలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కొడుకు శ్రీ తేజ ఆసుపత్రి పాలయ్యాడు. తిరిగి ఎప్పుడు సాధారణ పరిస్థితికి వస్తాడు తెలియని క్రమంలో పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి టాలీవుడ్కు షాక్ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈ ఘటనపై మండిపడ్డాడు. ఇకపై సినిమాల విషయంలో ఎలాంటి స్పెషల్ పర్మిషన్లు ఉండవని చెప్పాడు. ఈ క్రమంలోని అల్లు అర్జున్ ఆగమేఘేలపై ప్రెస్ మీట్ పెట్టి మరి తనతో పాటు.. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ డైరెక్టర్స్ అందరం కలిసి ఒక పంఢ్లా ఫ్యామిలీకి పెద్ద అమౌంట్ పిక్స్ డిపాజిట్ చేద్దామనుకున్నామంటూ చెప్పుకొచ్చాడు.
అయితే అరెస్ట్ అయిన తర్వాత అల్లు అర్జున్ ఇవన్నీ చెప్పుకొచ్చాడు. మొదట రూ.25 లక్షలు మాత్రమే సాయం ప్రకటించిన ఆయన.. నిజంగానే అభిమానులపై చిత్తశుద్ధితో ప్రేమతో సాయం చేయాలనుకుంటే.. ముందే ఈ విషయాన్ని చెప్పి ఉండాల్సింది కదా.. అందరం కలిసి ఇలా చేద్దాం అనుకుంటున్నామని ఎప్పుడు చెప్పలేదు. కానీ.. ఘటన జరిగిన ఇన్ని రోజుల తర్వాత మైత్రి మేకర్స్ సోమవారం నాడు రేవతి కుటుంబ సభ్యులకు రూ.50 లక్షల చెక్క అందజేశారు. ఇదంతా చూస్తుంటే సినిమా వందల కోట్లు సాధించిన.. భాదిత మహిళా కుటుంబానికి సాయం విషయంలో మాత్రం హైడ్రామానే ప్లే చేస్తున్నారని అనుమానాలు అందరిలోనూ మొదలయ్యాయి. అల్లు అర్జున్ వైపు అంతా కలిసి ఒక పెద్ద అమౌంట్ అంటే.. ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ సపరేట్గా వారికి రూ.50 లక్షల చెక్ అందించడం అందరికీ సరికొత్త సందేహాలు నెలకొల్పుతుంది.