భారత టెన్నిస్ స్టార్.. సానియా మీర్జా.. కొంతకాలం క్రితం పాకిస్తాన్ క్రికెట్ మాజీ కెప్టెన్.. ఆల్ రౌండర్.. షోయబ్ మాలిక్తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఈమె ఒంటరిగానే ఉంటుంది. కాగా షోయబ్ మాలిక్ పాకిస్తాన్ నటి సనా జువేద్ను వివాహం చేసుకున్నాడు. అతనికి ఇప్పటికే ఇది మూడవ వివాహం. కాగా.. సానియా మీర్జా కూడా రెండో పెళ్లికి సిద్ధమైంది అంటూ.. వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సానియా టర్కీ పర్యాటంలో బిజీగా గడుపుతుంది. దీనికి సంబంధించిన ఫోటోలను.. ఫ్యామిలీతో గడిపిన హ్యాపీ క్షణలను సానియా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంటుంది ఈ టెనీస్ స్టార్.
ఆమెతో పాటు ఆమె స్నేహితులు కూడా టర్కీలో ఉన్నారు. ఇక స్టార్ బ్యూటీ పరిణితి చోప్రా ప్రస్తుతం టర్కీలో తన స్నేహితులతో కలిసి వివాహ వేడుకను గ్రాండ్గా జరుపుకుంటుంది. ఇన్స్టా స్టోరీ లో పరిణితీ తన భర్త రాజకీయ నాయకుడు.. రాఘవ్ చద్దాతో ఉన్న ఫోటోలను షేర్ చేసుకుంది. కాగా ఇందులో సానియా మీర్జా కూడా ఉన్నారు. ఇక ఈ ఫోటోలతో పాటే పరిణితి, సానియా ఓ సాయంత్రం వేళ పడవపై కూర్చున్నట్లు.. ఫోటోను రిలీజ్ చేశారు. ఇద్దరు చిరునవ్వులు చిందిస్తూ సానియా పైకి.. పరిణితి వాలిపోయిన ఈ ఫోటో ప్రస్తుతం నెటింట వైరల్గా మారింది.
ఇక ఇప్పటికే షోయబ్ మాలిక్ పెళ్లి చేసుకున్న సనా జావెద్కు ఇది రెండో వివాహం. కాగా.. సానియా ఇప్పుడు సనా జావేద్ మొదటి భర్త అయినా ఉమైర్ జస్వాల్ ను వివాహం చేసుకోబోతుంది అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే ఉమైర్ కూడా షేర్వానీలో ఉన్న లేటెస్ట్ పిక్స్ ను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. అతను సానియాతో వివాహ బంధంలో అడుగుపెడుతున్నాడా.. లేదా.. వేరొకరితో వివాహం చేసుకోబోతున్నాడా అనేది ఇప్పుడు నెటింట హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ వార్తలను నిజమెంత తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.