స్వాతంత్ర దినోత్సవం పై ఫైర్ అయిన మెగా కోడలు ఉపాసన.. సెన్సేషనల్ పోస్ట్ వైరల్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన జంటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లోనే మోస్ట్ పవర్ఫుల్ కప్పుల్‌లో ఒకరిగా ఉన్న ఈ జంట.. లక్షల మంది అభిమానాన్ని సంపాదించారు. ఇక ఉపాసన మెగా కోడలుగానే కాకుండా.. అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్గా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొని లక్షలాదిమంది ప్రశంసలు అందుకుంటుంది. ఎప్పటికప్పుడు తన గొప్పతనం చాటుకున్న‌ ఈ అమ్మడు.. కరోనా సమయంలో ఎంతోమందికి సహాయం అందించి తన గొప్ప మనసును చాటింది. మారుమూల గ్రామాల్లో కూడా వైద్య సేవలు అందించడం, ఎన్నో రాష్ట్రాల్లో వృద్ధాశ్రమాలకు అండగా నిలుస్తూ ఫుడ్, టాబ్లెట్స్, ఇతర ప్రాధ‌మిక సౌకర్యాలను కూడా తానే కల్పిస్తూ మంచి పేరును సంపాదించుకుంటుంది.

Ram Charan - Upasana : రామ్ చరణ్, ఉపాసనకు పిల్లలు లేకపోవడానికీ అసలు కారణం  ఇదేనట.. – News18 తెలుగు

ఇప్పటికే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ ఇలా 150 రాష్ట్రాల్లోని వృద్ధాశ్రమాలకు సహాయం అందిస్తున్న ఉపాసన.. నేడు స్వతంత్ర దినోత్సవాన్ని ఉద్దేశిస్తూ మాత్రం షాకింగ్ పోస్ట్‌ షేర్ చేసుకుంది .మెగాస్టార్ చిరంజీవి కోడలుగా ఉపాసన సోషల్ మీడియా వేదికను వాడుకుంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. మనం ఎలాంటి స్వతంత్రాన్ని జరుపుకుంటున్నాం అంటూ నిలదీసిన ఈ అమ్మడు.. కోల్కత్తలో మహిళా వైద్యురాలి పై జరిగిన హత్యాచార సంఘటన గురించి రియాక్ట్ అయింది. మానవత్వాన్ని అపహాస్యం చేసే విధంగా ఎన్నో దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి అంటూ ఫైర్ అయ్యింది.

Here is combined net worth of Ram Charan, wife Upasana Kamineni

ప్రస్తుతం సొసైటీలో అనాగరికత బాగా కొనసాగుతుందని.. ఇలాంటి సందర్భాల్లో మనం ఎలాంటి స్వతంత్రం జరుపుకుంటున్నామంటూ ప్రశ్నించింది. దేశం ఆరోగ్య సంరక్షణకు మహిళలు వెన్నెముక అని చెప్పిన ఉపాసన.. ఎక్కువ మంది మహిళలని వర్క్ ఫోర్సులో తీసుకురావాలనేదే నా కల అని.. స్త్రీలకు మర్యాద.. ఒక సెక్యూరిటీ.. అందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం మహిళల సెక్యూరిటీ.. జరుగుతున్న అఘైత్యాలపై ఫైర్ అవుతూ ఉపాసన చేసిన ఈ పోస్టులు నెట్టింట సంచలనంగా మారింది.