కేవలం మూడు సినిమాలతో పాన్ ఇండిమన్ స్టార్ట్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. మొదట ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తర్వాత సావిత్రి బయోపిక్ మహానటి సినిమాని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో సినిమాతోనే క్లాసికల్ హిట్ అందుకొని మంచి పేరు తెచ్చుకున్న అశ్విన్ ఇప్పుడు కల్కి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రూ.700 కోట్లకు పైగా గ్రాస్ వశుళను కొల్లగొట్టి రూ.1000 కోట్ల రన్వైపు దూసుకుపోతున్న ఈ సినిమా కేవలం పాన్ ఇండియన్ లెవెల్ లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్తో దూసుకుపోతుంది.
ఇక ఈ సినిమా సక్సెస్ తో టాలీవుడ్ లో ఉన్న స్టార్ సెలబ్రిటీస్ అంతా మేకర్స్కు కృతజ్ఞతలు తెలియజేసిన సంగతి తెలిసిందే. వారిలో అందరికంటే ముందు మూవీ టీంకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశాడు. గతంలో నాగ్అశ్విన్ మహానటి సినిమా సక్సెస్ తరువాత కూడా చిరంజీవి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరి వారిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆ సమయంలో చిరంజీవి తన మనసులో కోరికను అశ్విన్ కు చెబుతూ అన్నగారు నటించిన పాతాళభైరవి లాంటి జానపద సినిమాలు చేయాలని ఆసక్తిగా ఉంది.. నాకోసం ఆ తరహా కథని సిద్ధం చేయండి అంటూ రిక్వెస్ట్ చేశాడట. ఈ క్రమంలో కలిగే సినిమాతో సక్సెస్ అందుకున్న నాగ్అశ్విన్ తన నెక్స్ట్ మూవీ నుంచి చిరంజీవితో చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.
ఆయన చిరంజీవి కోరికకు తగ్గట్లుగానే పాతాళభైరవి తరహా సినిమాను తీస్తాడా.. లేదా వేరే ఏదైనా జేనర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడా అన్నది క్లారిటీ రాలేదు. అయితే ఎన్టీఆర్ నటించిన పాతాళభైరవి సినిమాకి సీక్వెల్ గానే ఈ ప్రాజెక్టు ఉంటే కచ్చితంగా సినిమా సెట్స్ పైకి రాకముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొంటాయి అనడంలో సందేహం లేదు. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్స్ మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం కల్కి సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న నాగ్అశ్విన్.. కల్కి రెండో భాగంకి సంబంధించిన షూటింగ్ ఎలాగైనా ఈ ఏడాది చివరిలోపు పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లోపు అన్ని పనులను ముగించుకుని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట.