మన టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ ను.. ఇలా కూడా దెబ్బతీస్తున్నారే..!

ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ క్రేజ్‌ ఏ రేంజ్‌లో కొన‌సాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజురోజుకి టాలీవుడ్ ఖ్యాతి పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకుంటున్న మన హీరోలు.. ఇప్పుడు పాన్ వ‌ర‌ల్డ్‌లోనూ తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్ బాబు హీరోగా ఓ పాన్ ఇండియా సినిమా భారీ అంచనాలతో సెట్స్‌ పైకి రానున్న సంగతి తెలిసిందే. ఇక గతంలో కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితమైన మన స్టార్ హీరోలు.. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాల అవకాశాలను అందిపుచ్చుకుంటూ.. అక్కడ కూడా తమ సత్తా చాటే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోస్ బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మన హీరోలతో సినిమాలు చేయడానికి అక్కడ దర్శకులు కూడా ఆసక్తి చూపుతున్నారు. అయితే మన స్టార్ హీరోసే అక్కడ వాళ్ళను పెద్దగా నమ్మడానికి ఇష్టపడడం లేదు. కేవలం మన డైరెక్టర్లతోనే సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా సౌత్ సినిమాల హవా ప్రస్తుతం దక్షిణాదిలోను ఓ రేంజ్‌లో కొనసాగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు సినిమాల క్రేజ్ బాలీవుడ్‌లో దూసుకెళ‌డం అనేది నిజంగానే చాలా గొప్ప విషయం. టాలీవుడ్ ఎంత గర్వపడే విషయం.

ఎలాంటి టైం లో ప్రభాస్ కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని.. తెలుగు సినిమా సత్తాను మరోసారి చాటి చెప్పాడు. ఇక నుంచి నెలకో సినిమా చొప్పున బాలీవుడ్ తో తలపడేందుకు మన తెలుగు సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఆగస్టు 15న డబుల్ ఇస్మార్ట్ సినిమాతో రామ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సెప్టెంబర్ 27న దేవర జూనియర్ ఎన్టీఆర్ తన సత్తా చాటునడు. ఎలాగూ టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోల సక్సెస్‌ను బాలీవుడ్ ఆపలేక పోతుంది. వాళ్ల సినిమాలతో అయినా క‌నీసం సక్సెస్ అందుకుంటున్నారా అంటే అది కూడా జరగడం లేదు. దీంతో మన టాలీవుడ్ హీరోల నుంచి బాలీవుడ్‌కు రెండు రకాల గట్టి దెబ్బ పడుతుందనే చెప్పాలి. దీంతో బాలీవుడ్ కు భారీగా నష్టం జరుగుతుంది.